ప్రస్తుతం టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా చేస్తున్నాడు.డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన పూరీ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.అదే హుషారుతో లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
విజయ్ దేవరకొండ కు ఇప్పటికే యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.
ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకోవాలని విజయ్ చాలా శ్రమిస్తున్నాడు.పూరీ కూడా అదే టార్గెట్ తో విజయ్ ను కొత్తగా ప్రెసెంట్ చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకుంటున్నాడు.బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ విడుదల అయ్యి విశేష స్పందన లభించింది.ఈ కాంబోలో సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుండి ఏదొక రూమర్స్ వస్తూనే ఉన్నాయి.
అసలే రౌడీ స్టార్ అందులోనూ పూరీ జగన్నాథ్ తో సినిమా చేస్తున్న కారణంగా ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెరిగాయి.అయితే తాజాగా ఈ సినిమాపై మరొక రూమర్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో కీలక మైన పాత్ర కోసం రియల్ బాక్సర్ ను తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.అమెరికన్ బాక్సింగ్ మైక్ టైసన్ ను ఈ సినిమాలోని కీలక పాత్ర కోసం తీసుకుంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఈ వార్త ఎంత నిజమో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.ఇది ఇలా ఉంటే ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తో పాటు బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సంయుక్తం గా తెరకెక్కిస్తున్నారు.బడ్జెట్ విషయం లో ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
.