ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ అంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు మైక్ టైసన్.అతని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
టైసన్ రింగ్ లో ఉన్నాడు అంటే అప్పట్లో ఎలాంటి ప్రత్యర్ధి అని ఓడిపోవడం గ్యారెంటీ అనే మాట బలంగా వినిపించేది.ఇక హెవీ వెయిట్ బాక్సింగ్ నుంచి విశ్రమించిన టైసన్ మరల చాలా ఏళ్ల తర్వాత కరోనా చారిటీ కోసం రింగ్ లోకి దిగుతున్నాడు.
ఇక ఇతనితో తలపడే ప్రత్యర్ధి కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.ఇప్పుడు ఆ దిగ్గజ ఆటగాడు తాను మైక్ టైసన్ తో రింగ్ లో ఎగ్జిబిషన్ ఫైట్ లో తలపడుతున్నట్లు తెలిపాడు.
అమెరికాకు చెందిన ప్రొఫెషనల్ బాక్సర్ షనోన్ బ్రిగ్స్తో టైసన్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నాడు.ఈ విషయాన్ని బ్రిగ్స్ స్వయంగా వెల్లడించాడు.టైసన్, నేను బాక్సింగ్ రింగ్లో ఫైట్ చేయబోతున్నాం.చారిటీ బౌట్ కోసం ఇద్దరం సంతకాలు చేశాం అని ఇన్స్టాగ్రామ్ లైవ్లో బ్రిగ్స్ వెల్లడించాడు.అయితే, మ్యాచ్ ఎప్పుడన్నది ప్రకటించలేదు.2016 నుంచి బాక్సింగ్ రింగ్కు దూరంగా ఉన్న బ్రిగ్స్ కెరీర్లో 68 బౌట్లతో తలపడితే 60 సార్లు గెలుపొందాడు.ఇందులో 53 నాకౌట్ విజయాలున్నాయి.రెండుసార్లు వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్షిప్ దక్కించుకున్న బ్రిగ్స్ ఒకసారి డబ్ల్యూబీఓ టైటిల్ గెలిచాడు.మొత్తానికి ఇద్దరు దిగ్గజాల ఫైట్ ని రింగ్ లో చూడటానికి ఇప్పుడు బాక్సింగ్ ప్రేమికులు మరో సరి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.