మైక్రోసాఫ్ట్ విండోస్ దాదాపుగా అధికంగా ల్యాప్టాప్, పీసీలలో కనిపించే ఆపరేటింగ్ సిస్టమ్.మరో ఆపరేటింగ్ సిస్టమ్ మాక్ ఉన్నప్పటికీ దానిని ఎక్కువగా ఉపయోగించరు.
మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్నే సాధారణ జనాలు వాడుతుంటారు.అయితే ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ విండోస్ ముచ్చట ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నది అంటే.
దానికి ఓ కారణం ఉంది.
మైక్రోసాఫ్ట్ విండోస్ తన వినియోగదారులకు అత్యవసరంగా కొన్ని సూచనలు చేసింది.
అదేంటంటే మైక్రోసాఫ్ట్ సంస్థ యొక్క విండోస్ 10, విండోస్ 7 వాడుతున్న వారు వెంటనే తమ ఆపరేటింగ్ సిస్టమ్ను ఆప్డేట్ చేసుకోవాలి అని సూచించింది.విండోస్ 10లో ఓ లోపం బయటకు వచ్చిందని, ఆ లోపం వల్ల మీ డాటా చోరికి గురి అయ్యే అవకాశం ఉందని చెప్పింది.
దానిని నివారించేందుకు ఆపరేటింగ్ సిస్టమ్లో అవసరమైన మార్పులు చేశామని, వెంటనే విండోస్ను అప్డేట్ చేసుకుంటే మీ కంప్యూటర్లు, ల్యాప్టాప్లు సురక్షితంగా ఉంటాయని చెప్పింది.
ఇంతకీ ఏంటా లోపం, ఎందుకంత తొందర అంటారా ? దాని గురించి కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.సాధారణంగా విండోస్ 10లో ప్రింట్ స్పూలర్ అనే అప్లికేషన్ ఇన్బిల్డ్గా ఇన్స్టాల్ చేయబడి వస్తోంది.దీంతో ఎక్కువ సంఖ్యలో ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ల ద్వారా ఒకే సారి ప్రింటింగ్ సౌకర్యం పొందవచ్చు.
అయితే ఆ అప్లికేషన్లో లోపం ఉందని ఓ సైబర్ సెక్యూరిటీ కంపెనీ రీసెర్చర్ కనిపెట్టాడు.దానిని ఈ ఏడాది మేలో మైక్రోసాఫ్ట్ కంపెనీకి తెలియజేశారు.అయితే ఈ లోపం వల్ల డాటా ఎలా చోరి చేయవచ్చో అనే వివరాలను కూడా బయటి ప్రపంచానికి వెళ్లడించాడు.దీనిని గుర్తించిన మైక్రోసాఫ్ట్ ఆ వివరాలను డిలీట్ చేయించింది.
కానీ అప్పటికీ కొందరికి చేతిలోకి మాత్రం వెళ్లిపోయింది.ఇది ఎప్పటికైనా ప్రమాదమే అని గుర్తించిన మైక్రోసాఫ్ట్ ఆ లోపాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించింది.
అందులో భాగంగానే ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ను అప్డేట్ చేయాలని సూచిస్తోంది.