కరోనా కష్ట కాలంలో ప్రజలు అందరు ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయం అందరికి తెలిసిందే.ఉద్యోగులు సైతం ఉద్యోగాలు లేక ఇంటికే పరిమితం అయ్యారు.
ఈ క్రమంలో ఉద్యోగుల ఇబ్బందులను అర్ధం చేసుకుని, వాళ్ళకి మంచి చేసే క్రమంలో ఐటీ కంపెనీలు ఒక మంచి ఆలోచన చేసారు.అది ఏంటంటే.
ఐటీ కంపనీలో పనిచేసే ఉద్యోగులకు అక్షరాలా ఒక లక్ష రూపాయల వరకు బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.ఈ డబ్బులు ఏ క్షణంలో అయిన ఉద్యోగుల అకౌంట్లలో పడవచ్చు.
అయితే ఈ డబ్బులు ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి పడవండోయ్.కేవలం టాప్ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులకు మాత్రమే పడతాయట.
అయిన లక్ష రూపాయిల బోనస్ అంటే ఆషామాషీనా చెప్పండి.కానీ.
, ఇది నిజం.టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ తమ ఉద్యోగులకు ఈ బోనస్ అందచనుంది.
మైక్రోసాఫ్ట్ సంస్థ తమ సంస్థలోని ఉద్యోగులకు కరోనా కాలంలో పాండామిక్ బోనస్ కింద లక్ష రూపాయిలను ఇవ్వనుంది.కానీ మైక్రోసాఫ్ట్ లోని GitHub, LinkedIn, and Zenimax లలో పని చేసే ఉద్యోగులకు మాత్రం ఈ బోనస్ వర్తించదట.
మిగతా మైక్రోసాఫ్ట్ లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఈ బోనస్ అందనుంది.
కరోనా వైరస్ కష్టకాలంలో తమ కంపెనీలో పని చేసే ఉద్యోగుల ఇబ్బందులను, అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారిని ఆదుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.జూలై నెల లేదా ఆగస్ట్ నెలలో ఈ బోనస్ డబ్బులు అమెరికా, విదేశీ మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల అకౌంట్లలోకి పడనున్నాయి.కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి దిగువున్న ఉండే అందరికి గిఫ్ట్ గా ఈ బోనస్ ఇవ్వనుంది.
ఎంతమంది ఉద్యోగులు ఈ గిఫ్ట్ అందుకోనున్నారో ఒకసారి చూద్దాం.ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ కంపెనీలో 1,75,508 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
వీళ్ళందరికీ బోనస్ ఇవ్వబోతున్నారు.ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ కంపెనీపై బోనస్ కింద 200 మిలియన్ డాలర్ల అదనపు భారం పడనుంది.అయితే ఈ బోనస్ కూడా అందరి సిబ్బందికి వర్తించదు.కేవలం మార్చి 31, 2021వ సంవత్సరానికి ముందు చేరిన కంపెనీ సిబ్బందికి మాత్రమీ ఈ ఆఫర్ వర్తించనుంది.
ఉద్యోగుల బాధలను అర్ధం చేసుకుని వాళ్ళ కష్టాలను తీరుస్తున్న మైక్రోసాఫ్ట్ కంపెనీ నిజంగా గ్రేట్ కదా.