బీజేపీ పార్టీలోకి చేరెందుకు ఇంజినీరింగ్ లెజెండ్, మెట్రోమేన్ ఇ.శ్రీధరన్ (88) సిద్దం అయ్యారట.
ఈయన 2011లో ఢిల్లీ మెట్రో చీఫ్ గా రిటైర్ అయ్యారు.ఇక శ్రీధరన్ ను భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీతో, 2008 లో పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది కూడా.
కాగా ఈయన ఢిల్లీ మెట్రోరైల్ ప్రాజెక్టుతో పాటు దేశంలోని పలు ప్రాజెక్టుల నిర్మాణంలో పాలుపంచుకున్నారు.ఇకపోతే కేరళ అసెంబ్లీకి మే నెలలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపధ్యంలో బీజేపీ కేరళలో విజయయాత్ర పేరుతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతోంది.
ఈ సందర్భంగా 88 ఏళ్ల శ్రీధరన్ బీజేపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారట.అంతే కాకుండా పార్టీ కోరితే ఎన్నిల్లో పోటీ చేయడానికి కూడా తాను సిద్ధమేనని, తన సమయాన్ని, అనుభవాన్ని రాజకీయాల ద్వారా ప్రజలకు అందించాలని అనుకుంటున్నానని వెల్లడిస్తున్నారు శ్రీధరన్.ఇక బీజేపీలో చేరడానికి కొన్ని అధికారికమైన ఫార్మాలిటీస్ మాత్రమే మిగిలి ఉన్నాయి.
అవి పూర్తైన వెంటనే తాను కమళంలో చేరుతానని పేర్కొంటున్నారు.