మీటూ’ ఉద్యమం చిన్నగా మొదలయిన ఇప్పుడు అది కాక పుట్టిస్తోంది.ఈ ఉద్యమం ద్వారా ఒక్కొక్కరూ బయటకి వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని బయటకి చెప్పుకుంటున్నారు.
ఎంతమంది పేరున హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఇలా అందరి జాతకాలు బయటపడుతున్నాయి.ఇప్పడు సెగ ప్రముఖ నటుడు అర్జున్కు కూడా తగిలింది.
‘నిబునన్’(కురుక్షేత్రం) అనే తమిళ సినిమాలో అర్జున్తో కలిసి నటించిన శ్రుతి హరిహరణ్ సంచలన వ్యాఖ్యలు చేసింది.‘నిబునన్’ సెట్లో అర్జున్ తనను వేధించాడని, తన వీపును నిమిరాడని పేర్కొంది.
తనను మరింత దగ్గరికి లాక్కుని ‘ఇలా ప్రయత్నిద్దామా?’ అని డైరెక్టర్ను చూసి అడిగేసరికి తాను ఒక్కసారిగా షాక్కు గురైనట్టు చెప్పింది.
శనివారం సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ఆమె బయటపెట్టింది.తానిప్పుడు ఎంతో విరక్తితోనే ఈ విషయాన్ని బయపెట్టినట్టు శ్రుతి తెలిపింది.తాను చినప్పటి నుంచి అర్జున్ సినిమాలు చూస్తూ పెరిగానని పేర్కొన్న శ్రుతి.
అతడి చేతిలోనే తనకు వేధింపులు ఎదురుకావడంతో షాక్కు గురయ్యానని తెలిపింది.అదృష్టవశాత్తు తాను క్యాస్టింగ్ కౌచ్ వంటి వాటిని ఎదుర్కోలేదని పేర్కొంది
.