ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. !

రాష్ట్రాల్లో వాతావరణ పరిస్దితులు విచిత్రంగా కనిపిస్తున్నాయి.ఒకవైపు ఎండలు దంచికొడుతూనే, వర్షపు చినుకులు రాలుతున్నాయి.

 Meteorological Department Warns Ap People Ap Peoples, Alert, Giving Warning, Met-TeluguStop.com

ఇక ఎండ వేడి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు ఏపీ ప్రజలకు ఒక హెచ్చరిక జారీ చేశారు.

ఈ నెల 16 నుంచి 22 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.కాగా ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఎండలు పెరిగి అకాల వర్షాలు పడే అవకాశం ఉందని, దీని వల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని వెల్లడించారు.

దీనికి తోడు దక్షిణ బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమగాలులు రాష్ట్రంపై విస్తరిస్తున్నాయి.ఈమేరకు రాయలసీమలోని కర్నూలులో వర్షాలు ప్రారంభమై క్రమ క్రమంగా మిగిలిన జిల్లాలకు విస్తరిస్తాయని, కోస్తాంధ్రలోనూ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు.

ఇకపోతే దక్షిణ కోస్తా, రాయలసీమలో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube