గత కొన్ని రోజుల నుండి తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.ఇటువంటి తరుణంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడటంతో వచ్చే రెండు రోజులు ఏపీలో కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరించింది.
ఈ క్రమంలో ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది.
ఈ క్రమంలో మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.ఏపీలో వచ్చే రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి.కృష్ణా జిల్లాలలో.
విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల భారీ వేగంతో.
గాలులు వీస్తాయని.ఈ క్రమంలో మత్స్యకారులు వేటకు వెళ్లడాన్ని నిషేధించిన అధికారులు తాజాగా స్పష్టం చేశారు.
ఈ క్రమంలో తహశీల్దార్లు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.