ఏ రంగంలో అయినా సరే భారీ పోటీ ఉంటుంది.ప్రతి రంగంలోనూ భారీగా కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి.
దీంతో ఏ రంగంలోకి అడుగుపెట్టాలన్నా పోటీకి తట్టుకోని నిలపడగలగాలి.కస్టమర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి.
వారికి నచ్చేలా ప్రొడక్ట్స్ను తీసుకొస్తూ ఉండాలి.ఎప్పటికప్పుడు ఫీచర్లను అప్డేట్ చేసుకుంటూ లేటెస్ట్ టెక్నాలజీని( Technology ) అందుబాటులోకి తీసుకురావాలి.
తాజాగా ప్రముఖ టెక్ దిగ్గజం మెటా సీఈవో మార్క్ జూకర్బర్గ్( Meta CEO is Mark Zuckerberg ) కీలక ప్రకటన చేశారు.యాపిల్కు పోటీగా రియాలిటీ హెడ్సెట్ తీసుకురానున్నట్లు తాజాగా వెల్లడించారు.క్విస్ట్ 2 కలర్ మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్( Quist 2 Color Mixed Reality Headset ) తీసుకురానున్నట్లు ప్రకటించారు.జూన్ 5న యాపిల్ కంపెనీ మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ను మార్కెట్లోకి విుడదల చేయనుందనే వార్తల నేపథ్యంలో మార్గ జూకర్ బర్గ్ చేసిన ప్రకటన హాట్టాపిక్గా మారింది.
సెప్టెంబర్ 27న ఈ హెడ్సెట్కు సంబంధించిన పూర్తి వివరాలను చెబుతామని అన్నారు.ఈ హెడ్సెట్ సన్నగా ఉంటుందని తెలుస్తోంది.దీని ధర రూ.41 వేల వరకు ఉంటుందని చెబుతున్నారు.
క్వాల్కాం చిప్సెట్ను ఈ హెడ్సెట్ కలిగి ఉంటుందని చెబుతున్నారు.ఇది మంచి గ్రాఫిక్స్ అనుభూతిని అందించడంతో పాటు హైక్వాలిటీ ఉంటుంది.మెటా నుంచి ఇప్పటికే అనేక క్విస్ట్ హెడ్సెట్లు విడుదలయ్యాయి.హై ఎండ్ మెటా క్విస్ట్ ప్రో హెడ్సెట్ ధర ప్రస్తుతం రూ.82,315గా ఉంది.ఇక క్విస్ట్ 2 హెడ్సెట్ ధర రూ.36,395గా ఉంది.క్విస్ట్ హెడ్సెట్ల రంగంలోకి మెటాకు గట్టి పట్టుంది.
హెడ్సెట్ల విక్రయాల్లో కూడా మోాటా ముందు ఉంది.దాదాపు 80 శాతం విక్రయాలు మోటావే జరుగుతున్నట్లు ఇటీవల పలు రిపోర్టులు తెలిపాయి.
ఈ క్రమంలో ఆపిల్గా పోటీగా రియాలిటీ హెడ్సెట్ రంగంలో దూసుకెళ్లాలని మోటా భావిస్తోంది.అందుకే యాపిల్కు పోటీగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రొడక్ట్స్ తీసుకొస్తుంది.