ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి.ఇంకా ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో పజిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆ పజిల్ చూస్తే వావ్ అంటారు.అలా ఉంది ఆ పజిల్.
అంతటి పజిల్ ఏంటి అబ్బా అనుకుంటున్నారా? అదేనండి.ముంబై పోలీసులు ఓ పజిల్ పెట్టారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.ముంబైలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి.ఇంకా ఈ నేపథ్యంలోనే పోలీసులు ప్రజలకు అవగాహనా కల్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఓ పజిల్ ని పోస్ట్ చేసి అవగాహనా పెంచేందుకు ప్రయత్నించారు.
ఇంకా ఆ పజిల్ పరిష్కరించి అందులో ఉన్న అర్థాన్ని తెలుసుకోండి అంటూ నెటిజన్లకు చాలెంజ్ విసిరారు.ఇదేమంత కఠినమైనది కాదంటూ కామెంట్ చేశారు.బాధ్యత వహించే ముంబైవాసులకు ఇది తప్పకుండా తెలుస్తుందని పేర్కొన్నారు.ఇంకా ఆ పజిల్ లో ఎం ఉందంటే? ”ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనికి వెళ్లండి, ఆ తర్వాత 9 గంటల నుంచి ఉదయం ఐదింటి వరకు ఇంట్లోనే ఉండండి.” అంటూ పజిల్ ని విసిరారు.ఇంకా ఈ పజిల్ కి ఫిదా అయినా ముంబై వాసులు కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు.
దీంతో ఈ పజిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.