మానవత్వం మంట కలుస్తుందని మనం రెగ్యులర్గా అంటూ ఉంటాం, వింటూ ఉంటాం.కాని కొందరిని చూస్తుంటే మాత్రం ఇంకా మానవత్వం మిగిలే ఉందేమో అనిపిస్తుంది.
అందరు తమకు ఎందుకులే అని వదిలేస్తున్నా కొందరు మాత్రం అయ్యో పాపం అంటూ పట్టించుకుంటూ ఉంటారు.ఇటీవల ఢిల్లీలో ఒక కోతి రోడ్డు పక్కన గాయాలతో పడి ఉంది.
చావు బతుకుల మద్య కొట్టు మిట్టాడుతున్న ఆ కోతిని బతికించేందుకు ఏ ఒక్కరు ప్రయత్నిచండం లేదు.దాంతో ఆ కోతిని ఒక మీడియా వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఆ కోతి ఉన్న అడ్రస్ను పోస్ట్ చేసి మాజీ మంత్రి మేనకా గాంధీతో పాటు కొన్ని స్వచ్చంద సంస్థలను ట్యాగ్ చేశాడు.వెంటనే స్పందించిన మేనకా గాంధీ తన కారును ఆ కోతి ఉన్న వద్దకు పంపించింది.
తన కారులోనే ఆ కోతిని హాస్పిటల్కు పంపించినట్లుగా పేర్కొంది.ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకు వచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ ఆమె పేర్కొంది.
జంతువులపై చాలా ప్రేమ కలిగి ఉండే ఆమె వెంటనే స్పందించడం పట్ల నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.