రోజు రోజుకి సమాజంలో మ్రుగాళ్ళు గా మారిన మగాళ్ల అరాచకాలు ఎక్కువ అయిపోతున్నాయి.ఆడవాళ్ళు ఒంటరిగా దొరికితే ఏదో ఒక విధంగా ఆమెని అనుభవించి కోరిక తీర్చుకోవాలనే కామవాంచలు ప్రతి ఒక్కరిలో పెట్రేగిపోతున్నాయి.
చిన్న, పెద్ద అని తేడా లేకుండా ఆడవాళ్ళు అయితే చాలు అనే మృగ వాంఛ ఎక్కువై ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు.ఈ మధ్యకాలంలో జరుగుతున్న సంఘటనలు ఆడవాళ్ళని అడుగడుగున భయపెడుతున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఓ సంఘటన సభ్య సమాజం తలదించుకునేళా చేసింది.
కిడ్నీ వ్యాధితో భాదపడుతున్న తన సోదరికి తోడుగా హాస్పిటల్ కి వచ్చిన ఓ మహిళపై ఓ కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు.
మొదటిగా ఆమెతో మాటలు కలిపి తాను హాస్పిటల్ లో పని చేస్తున్నట్లు నమ్మించే ప్రయత్నం చేసాడు.నెమ్మదిగా ఆమె వివరాలు తెలుసుకొని ఆమెకి ఆసరాగా ఉంటున్నట్లు నమ్మించి, హాస్పిటల్ పై అంతస్తులో ఓ ఫామ్ నింపితే మందులు తక్కువ రేటుకు ఇస్తారని చెప్పి టెర్రస్ పైకి తీసుకెళ్ళాడు.
అక్కడ ఆమెని బలవంతంగా అత్యాచారం చేసే ప్రయత్నం చేయగా, ఆమె తనకి ఎయిడ్స్ వుందని, తనని వదిలేయమని ప్రదేయ పడింది.అయితే అతను వినకుండా అత్యాచారం చేశాడు.
ఘటన తర్వాత ఆమె దగ్గర్లోని సియాన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.హాస్పిటల్ లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా అత్యాచారం చేసింది అన్నప్ప అనే యువకుడిగా గుర్తించి అతనిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.