మద్యపానం మానవ జీవితాలలో ఎంత కలకలం రేపుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తాజాగా ఓ వ్యక్తి ఫుల్ బాటిల్ మందు తాగుతానని పందెం కాసి ఏకంగా తన ప్రాణాలను వదిలిన ఘటన నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలోని ధర్పల్లి అనే గ్రామంలో కదమంచి కాశయ్య అనే వ్యక్తి నివసిస్తున్నా డు.ఇతడు పాత సామాన్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు.అయితే తన స్నేహితులతో సరదాగా ముందు కొట్టాలనుకున్న అతడి ఆలోచన ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి దారితీసింది.గురువారం రోజున తన స్నేహితులతో మద్యం సేవించాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అతడి స్నేహితులు పిలిపించి అందరూ కలిసి మద్యం సేవించారు.
అయితే ఈ క్రమంలో ఓ స్నేహితుడు కొద్దిపాటి పద్యానికే నీకు ఫుల్లుగా మత్తెక్కిందంటూ కాశయ్యని ఎద్దేవా చేశాడు. దీంతో కాశయ్య అవమానంగా భావించి అరగంటలో ఫుల్ బాటిల్ మద్యం తాగుతానని అతడితో పందెం కాశాడు.అనుకున్నదే తడవు తడవుగా ఫుల్ బాటిల్ మందు తెచ్చి తాగడం మొదలు పెట్టాడు.
అయితే కొంతసేపటి తర్వాత ఫుల్లుగా మత్తు లో స్మారక స్థితి లో జారుకున్నాడు.దీంతో ఎప్పట్లాగే కాశయ్యకి మత్తు ఎక్కిందని భావించిన అతడి స్నేహితులు అతడిని అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోయారు.
తీరా చూస్తే నిన్నటి రోజున ఎంత సేపటికి నిద్ర లేవకపోవడంతో దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే కాశయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
.