ఫుల్ బాటిల్ మందుతో పందెం చివరికి...

మద్యపానం మానవ జీవితాలలో ఎంత కలకలం రేపుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తాజాగా ఓ వ్యక్తి ఫుల్ బాటిల్ మందు తాగుతానని పందెం కాసి ఏకంగా తన ప్రాణాలను వదిలిన ఘటన నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లిలో చోటుచేసుకుంది.

 Men Died For The Heavy Alcohol Drinking In Nizamabad-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలోని ధర్పల్లి అనే గ్రామంలో కదమంచి కాశయ్య అనే వ్యక్తి నివసిస్తున్నా డు.ఇతడు పాత సామాన్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు.అయితే తన స్నేహితులతో సరదాగా ముందు కొట్టాలనుకున్న అతడి ఆలోచన ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి దారితీసింది.గురువారం రోజున తన స్నేహితులతో మద్యం సేవించాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అతడి స్నేహితులు పిలిపించి అందరూ కలిసి మద్యం సేవించారు.

Telugu Alcohol, Heavyalcohol, Nizamabad-Telugu Crime News(క్రైమ్ వ

అయితే ఈ క్రమంలో  ఓ  స్నేహితుడు కొద్దిపాటి పద్యానికే నీకు ఫుల్లుగా మత్తెక్కిందంటూ కాశయ్యని ఎద్దేవా చేశాడు. దీంతో కాశయ్య అవమానంగా భావించి అరగంటలో ఫుల్ బాటిల్ మద్యం తాగుతానని అతడితో పందెం కాశాడు.అనుకున్నదే తడవు తడవుగా ఫుల్ బాటిల్ మందు తెచ్చి తాగడం మొదలు పెట్టాడు.

అయితే కొంతసేపటి తర్వాత ఫుల్లుగా మత్తు లో స్మారక స్థితి లో జారుకున్నాడు.దీంతో ఎప్పట్లాగే కాశయ్యకి  మత్తు ఎక్కిందని భావించిన అతడి స్నేహితులు అతడిని అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోయారు.

 తీరా చూస్తే  నిన్నటి రోజున ఎంత సేపటికి నిద్ర లేవకపోవడంతో దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే కాశయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube