ప్రస్తుత కాలంలో జరిగేటువంటి కొన్ని సంఘటనలు గురించి వింటుంటే ఇలాంటి క్రూరమైన సమాజంలో మనం బ్రతుకుతున్నామా.! అనే సందేహం కలగక మానదు.
అలాగే ఈ మధ్యకాలంలో కొందరి కామ కోరికలకి మూగ జీవాలు బలవుతున్నాయి. తాజాగా 30 సంవత్సరాలు కలిగినటువంటి ఓ వ్యక్తి కామంతో కొట్టుమిట్టాడుతూ అభం శుభం ఎరుగని కుక్కని దారుణంగా అత్యాచారం చేసిన ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబాయి నగరంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే “శోభనాథ్ సరోజ్” అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక నగరంలోని ములంద సొసైటీ పరిసర ప్రాంతంలో నివాసముంటున్నాడు.అయితే తాజగా శోభనాథ్ సరోజ్ కార్లు నిలిపి ఉంచే ప్రదేశంలో కట్టేసిన ఓ కుక్కని బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి దారుణంగా అత్యాచారం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అధికారులు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి మూగ జీవాల స్వచ్ఛంద సంస్థకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న స్వచ్ఛంద సంస్థ సిబ్బంది మరియు పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని దారుణంగా అత్యాచారానికి గురైన కుక్కని జంతువుల ఆస్పత్రికి తరలించారు.
అలాగే స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకుని నిందితుడు శోభనాథ్ సరోజ్ ని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ మూగ జీవం అయినటువంటి కుక్కపై ఇంతటి అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితుడు శోభనాథ్ సరోజ్ ని కఠినంగా శిక్షించాలని పోలీసులను సంబంధిత అధికారులను కోరుతున్నారు.