దారుణం : పదే పదే ఆడపిల్లల్ని కంటుందని భార్యపై భర్త ఏకంగా...

ప్రస్తుత కాలంలో కొందరు అవగాహన లేకుండా చేసేటటువంటి పనుల కారణంగా తమ కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండుతుంది. తాజాగా ఓ వ్యక్తి తన భార్య నాలుగు కాన్పులలో నలుగురు ఆడపిల్లల్ని కనిందని ఏకంగా ఆమెపై కత్తితో దారుణంగా దాడి చేసి హత మార్చిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

 Men Murdered Wife In Kurnool,men Brutally Murdered, Kurnool, Crime News, Giving-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందిన కర్నూలు జిల్లాలో బాలరాజు అనే వ్యక్తి తన భార్య, కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.అయితే బాలరాజు తన భార్య వరుసగా నాలుగు కాన్పులలో నలుగురు ఆడ పిల్లలని కన్నదని దాంతో తనలో ఏదో లోపం ఉందని అందుకే వరుసగా ఆడపిల్లలు పుడుతున్నారని తరచూ ఆమెను చిత్రహింసలకు గురి చేసే వాడు.

దీంతో తన భార్య కుటుంబ సభ్యులు భార్యాభర్తలిద్దరికీ సర్ది చెప్పి కాపురానికి  పంపించే వారు.తాజాగా ఈ విషయంపై మరో మారు గొడవ జరిగింది.

ఈ గొడవలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో విచక్షణ కోల్పోయిన బాలరాజు తన భార్యపై దారుణంగా చేతికందిన కత్తితో దాడి చేశాడు.దీంతో తన భార్యకి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.

దాంతో భయపడిన  బాలరాజు తాను కూడా ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు.ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానికుల సహాయంతో బాలరాజు ని దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రిలో చేర్పించారు.

 అలాగే స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాలరాజు భార్య మృత దేహాన్ని దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube