ఈ మధ్య కాలంలో కొందరు నిజానిజాలు తెలుసుకోకుండా తీసుకునే నిర్ణయాలతో ఇతరుల జీవితాల్లో తీవ్ర విషాదం నిండుతోంది.కాగా తాజాగా ఓ యువకుడు పెళ్లయిన మహిళతో అక్రమ సంబంధం ఏర్పరచుకొని చివరికి ఆమె ఇంకో వ్యక్తితో చనువుగా ఉంటుందని అనుమానించి దారుణంగా హత్య చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందిన భువనగిరి జిల్లాలో కుమార్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అయితే ఇతడు కుటుంబ పోషణ నిమిత్తం హైదరాబాద్ నగరంలో క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.
ఈ క్రమంలో లక్ష్మి అనే మహిళ తో పరిచయం ఏర్పడింది.అయితే అప్పటికే లక్ష్మి భర్త మరణించి కొన్ని సంవత్సరాలు కావడంతో కుమార్ తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది.
కాగా ఈ మధ్య కాలంలో లక్ష్మి స్థానికంగా ఉన్నటువంటి మరో యువకుడితో చనువుగా ఉంటోంది.దీంతో కుమార్ లక్ష్మి పై అనుమానం పెంచుకుని తరచూ గొడవ పడుతూ ఉండేవాడు.
ఈ క్రమంలో తాజాగా మరోమారు ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే ఈ గొడవలో తీవ్ర ఆవేశానికి లోనయినటువంటి కుమార్ లక్ష్మి ని దారుణంగా హతమార్చాడు.
అనంతరం దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగి పోయాడు.నిందితుడు తెలిపిన వివరాల మేరకు పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.