ఈ మధ్య కాలంలో కొందరు కామంతో కొట్టుమిట్టాడుతూ వావి వరుసలు మరచి ప్రవర్తిస్థూ చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.కాగా ఓ వ్యక్తి తరచూ ఉద్యోగం నిమిత్తమై క్యాంపులకు వెళుతున్నాడని తన భార్య ఏకంగా మరిదితో కామ క్రీడలు సాగిస్తుండడంతో వివాహిత భర్త దారుణంగా తన తమ్ముడిపై దాడి చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని తిరుచ్చి పరిసర ప్రాంతంలో అరుణ్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు.కాగా అరుణ్ కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.
దీంతో ఎక్కువగా బయటి ప్రాంతాలకు వెళ్తూ వస్తూ ఉండేవాడు.ఈ క్రమంలో అరుణ్ భార్యకి మరిది వరుసయ్యే జాక్సన్ అనే యువకుడు పరిచయమయ్యాడు.
అయితే భర్త ఇంట్లో లేకపోవడంతో ఒంటరితనం ఫీల్ అయినటువంటి అరుణ్ భార్య తొందరగానే జాక్సన్ తో ప్రేమలో పడింది.ఈ క్రమంలో వీరిద్దరూ అరుణ్ ఇంట్లో లేని సమయంలో కామ క్రీడల్లో మునిగి తేలేవాళ్ళు.
దీంతో తాజాగా ఈ విషయం ఇతరుల ద్వారా అరుణ్ కి తెలిసింది.దీంతో మరోమారు జాక్సన్ తో మాట్లాడొద్దని అంటూ తన భార్యని అరుణ్ హెచ్చరించాడు.అయినప్పటికీ అరుణ్ భార్య మాత్రం తన భర్త మాటలను ఖాతరు చేయలేదు.అనంతరం తరచూ వీరిద్దరూ బయట ప్రాంతాల్లో కలుసుకునేవారు.
దీంతో తాజాగా అరుణ్ పని నిమిత్తమై బయటికి వెళ్లి వస్తుండగా అరుణ్ భార్య మరియు తన ప్రియుడు కంట పడ్డారు.దీంతో ఆవేశం కట్టలు తెచ్చుకోవడంతో అరుణ్ తన తమ్ముడి పై చేతికందిన కత్తితో దారుణంగా దాడి చేసి గాయపరిచాడు.
కాగా ప్రస్తుతం బాధితుడు దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ విషమ పరిస్థితిలో ఉన్నట్లు సమాచారం.