ప్రస్తుత కాలంలో కొందరు వ్యక్తులు తమ కామవాంఛలను తీర్చుకోవడం కోసం ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు.తాజాగా ఓ వ్యక్తి తనకు వరసకు మరదలు అయ్యేటువంటి యువతిపై కన్నేసి ఏకంగా ఆమెను అనుభవించడం కోసం తిండి పదార్థాలలో మత్తు మందు ఇచ్చి తన కామ వాంఛలు తీర్చుకున్న ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే హజారీఘర్ జిల్లాకి చెందిన ఓ గ్రామంలో కొల్లేశ్వర్ అనే యువకుడు స్థానిక ప్రాంతంలో తన తల్లిదండ్రులతో కలసి నివాసముంటున్నాడు.అయితే ఇదే ప్రాంతంలో తనకు మరదలయ్యే ఓ యువతి కూడా తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటోంది.
అయితే గత కొద్దికాలంగా కొల్లేశ్వర్ తన మరదలిపై కన్నేశాడు.ఇందులో భాగంగా ఆమెను దక్కించుకోవాలని పలు ప్రయత్నాలు చేసేవాడు.
అయితే తాజాగా యువతి కొల్లేశ్వర్ పని నిమిత్తమై ఇంటికి వచ్చింది.అయితే యువతి వచ్చిన సమయంలో యువకుడి తల్లిదండ్రులు ఎవరు ఇంట్లో లేరు.
దీంతో ఇదే అదునుగా భావించిన కొల్లేశ్వర్ యువతికి మత్తు పదార్థాలు కలిగినటువంటి తినుబండారాలు పెట్టగా ఆమె వాటిని తిని మెల్లగా మత్తు లోకి జారుకుంది.దీంతో యువతిపై కొల్లేశ్వర్ దారుణంగా అత్యాచారం చేశాడు.
మెలుకువ వచ్చిన అనంతరం యువతి తనపై అత్యాచారం జరిగినట్లు తెలుసుకుంది.ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది.దీంతో వెంటనే వారు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ను సంప్రదించి కొల్లేశ్వర్ పై ఫిర్యాదు చేశారు.బాధితురాలి తల్లిదండ్రులు వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.