అమెరికా తొలి మహిళ.అధ్యక్షుడి తో పాటు సమాన గౌరవాన్ని పొందే వ్యక్తి.
డోనాల్డ్ ట్రంప్ సతీమణి మేలనియా ట్రంప్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.దాంతో ఈ వార్త కాస్తా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
అయితే అసలు మేలనియా విగ్రహానికి నిప్పు ఎందుకు పెట్టారు అనేది ఇప్పుడు సర్వాత్రా చర్చనీయాంశం అయ్యింది.మెలానియా ట్రంప్ స్వస్థలం అయిన స్లోవేనియాలో ఆమె విగ్రహానికి నిప్పు పెట్టడంతో ఆమె తీవ్ర ఆవేదన చెందుతున్నట్టుగా తెలుస్తోంది.
పూర్తి వివరాలలోకి వెళ్తే.
ఈ నెల 4 వ తేదీన అమెరికా స్వాతంత్ర వేడుకలు జరిగిన విషయం విధితమే.
అదే రోజున మెలానియా విగ్రహానికి నిప్పు పెట్టారని ఆమె విగ్రహాన్ని రూపొందించిన బ్రాడ్ డైనీ తెలిపారు.తాను ఎంతో కష్టపడి ఈ విగ్రహాన్ని రూపొందించానని గుర్తు తెలియని దుండగులు ఇలాంటి దుశ్చర్యలకి పూనుకున్నారని అన్నారు.
వాళ్ళు ఎందుకు ఈ దాడికి పాల్పడ్డారో తానూ తెలుసుకోవాలని అనుకుంటున్నట్టుగా బ్రాడ్ ప్రకటించారు.అయితే ఈ పరిణామాలు అమెరికాలో రాజకీయ రచ్చ రేపుతున్నాయి.
అమెరికాలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విగ్రహాన్ని తగులబెట్టడం రాజకీయ చర్యలేనని నిపుణులు అంటున్నారు.గతంలో డోనాల్డ్ ట్రంప్ చెక్క విగ్రహాన్ని కూడా దుండగులు ద్వంసం చేశారని తెలుస్తోంది.ఇదిలా ఉంటే ఈ పరిణామాలు ట్రంప్ ని అమెరికన్స్ ఇష్టపడటంలేదు అని చెప్పడానికే అన్నట్టుగా ఉన్నాయని, ఇదే కావాలనే రాజకీయంగా దెబ్బ కొట్టడానికి ప్రత్యర్ధులు కుట్ర చేస్తున్నారని ట్రంప్ వర్గం ఆరోపిస్తోంది.