అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన భర్త తరుపున ప్రచారం చేసేందుకు మళ్ళీ సిద్దమవుతున్నారు అమెరికా ప్రధమ మహిళ మెలానియా ట్రంప్.కొద్ది రోజుల క్రితం ట్రంప్ , మెలానియా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
అప్పటి నుండి మెల్ల మెల్లగా కోలుకుంటూ పూర్తిగా కరోన నుండి బయటపడ్డారు.ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఎన్నికల ర్యాలీలో మరోసారి పాల్గొనడానికి సిద్దంగా ఉన్నారు.
కరోనా సోకినా తరువాత తొలి సారిగా బహిరంగ ప్రచారానికి ఆమె సిద్దమయ్యారు.ఈ క్రమంలోనే
మెలానియా ట్రంప్ కోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు ట్రంప్ ప్రచార బృందం.
ఇప్పటికే ట్రంప్ కుటుంభ సభ్యులు ఒక్కొక్కరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు.ఈ వారం మొత్తం ఇవాంక ట్రంప్ మిచిగాన్ విస్కాన్సిస్ ,నార్త్ కరోలినా ప్రాంతాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
ట్రంప్ ఎన్నికల ప్రచారంతో పాటు పలు ప్రాంతాలలో బిడెన్ కంటే వెనుకబడి ఉన్నారని పలు సర్వేలు చెప్తున్న నేపధ్యంలోనే కుటుంభ సభ్యులు అందరూ ట్రంప్ కోసం ప్రచారంలో పాల్గొంటున్నారని తెలుస్తోంది.ఇదిలాఉంటే
ప్రచారంలో పాల్గొనే ప్రతీ ఒకరికి ధర్మల్ స్క్రీన్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.మాస్క్ ధరించిన వారు మాత్రమే ప్రచారంలో పాల్గొనేలా షరతులు పెడుతున్నారు.
మెలానియా కోసం ఆమె అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని, తనదైన శైలిలో మాట్లాడటం, ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటాయని ప్రచార నిర్వాహకులు అంటున్నారు.కానీ స్థానిక మీడియా మాత్రం వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది డెమోక్రటిక్ పార్టీనేనని సర్వేలు కూడా ఇదే చెప్తున్నాయని ఈ ఎన్నికల్లో ట్రంప్ ఓటమి ఖాయమని అంటోంది.