మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తి చేసుకోవడంతో, వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఇక ఈ సినిమా పూర్తికాకముందే చిరు తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి ఓకే చేస్తున్నాడు.ఇప్పటికే మెహర్ రమేష్, వివి వినాయక్లతో తన నెక్ట్స్ చిత్రాలను ఓకే చేశాడు ఈ హీరో. అయితే ప్రస్తుతం ఫేడవుట్ అయిన దర్శకుడు మెహర్ రమేష్తో చిరంజీవి ‘వేదాళం’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమా కథలో కొన్ని మార్పులు చేయాల్సిందిగా ఇప్పటికే మెహర్ రమేష్కు చిరు సూచించాడు.
దీంతో కొద్దిరోజులుగా ఇదే పనిలో ఉన్న మెహర్ రమేష్, ఎట్టకేలకు చిరు ఇమేజ్కు తగ్గట్టుగా ఓ పవర్ఫుల్ స్క్రిప్టును రెడీ చేశాడట.ఇది విన్న చిరు కూడా వెంటనే మెహర్ రమేష్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
దీంతో మెహర్ రమేష్ ఈ సినిమాకు సంబంధించిన తొలి విజయాన్ని అందుకున్నట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు.
గతంలో శక్తి, షాడో వంటి అట్టర్ఫ్లాప్ చిత్రాలతో ప్రేక్షకులను భయపెట్టిన మెహర్ రమేష్, ఇంత గ్యాప్ తరువాత చిరుతో చేస్తున్న చిత్రం ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
అయితే తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వేదాళం’ చిత్ర కథలో దమ్ముండటంతో ఈ సినిమా చిరుకు బాగా కలిసొస్తుందని ఆయన అభిమానులు అంటున్నారు.ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చిరు అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.
ఈ సినిమాలో మిగతా నటీనటుల విషయంలో ఓ క్లారిటీ రావాల్సి ఉంది.అటు ఆచార్య చిత్ర షూటింగ్ను కూడా వీలైనంత త్వరగా ముగించేయాలని మెగాస్టార్ చూస్తున్నాడు.