మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి ఓకే చేస్తూ దూసుకుపోతున్నాడు.ఇప్పటికే ఆచార్య చిత్రాన్ని షూటింగ్ జరుపుకుంటున్న మెగాస్టార్, ఆ తరువాత మరో మూడు సినిమాలను క్యూలో పెట్టేందుకు రెడీ అయ్యాడు.
ఈ క్రమంలో దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.అయితే వరుస ఫ్లాపులతో ఫేడవుట్ అయిన మెహర్ రమేష్కు చిరు ఛాన్స్ ఇవ్వడంతో ఈ కాంబో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.
అయితే ఈసారి ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా మెహర్ రమేష్ ఓ రీమేక్ కథను రెడీ చేస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.తమిళంలో 2015లో విడుదలైన ‘వేదాలం’ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.
తలా అజిత్ నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని తెలుగులో చిరంజీవి రీమేక్ చేయాలని ఎప్పటినుండో ప్రయత్నిస్తున్నాడు.అయితే మెహర్ రమేష్ డైరెక్షన్లో ఈ సినిమాను అతి త్వరలో పట్టాలెక్కించేందుకు చిరు రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమా షూటింగ్ నిమిత్తం లొకేషన్ల ఎంపికలో బిజీగా ఉన్నాడు ఈ డైరెక్టర్.ఇప్పటికే కోల్కతాలోని పలు ప్రదేశాలను మెహర్ రమేష్ ఓకే చేసుకున్నాడని, సినిమాలోని పలు కీలక సన్నివేశాలను అక్కడే చిత్రీకరించేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.
ఏదేమైనా తమిళ సూపర్ హిట్ మూవీని తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్న చిరు, ఈ సినిమాతో అదిరిపోయే సక్సెస్ కొడతాడని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.ఇక ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ కూడా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.
ఇక చిరు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్యను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని కొరటాల శివ అండ్ టీమ్ భావిస్తోంది.