తెలుగులో ప్రసారం అవుతున్న బీబీ జోడీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇటీవల మొదలైన ఈ షో అతి తక్కువ సమయంలోనే బాగా క్రేజ్ ని సంపాదించుకుంది.
ఈ షోకి శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తుండగా సదా, సీనియర్ హీరోయిన్ రాధ, తరుణ్ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్న కంటెస్టెంట్లను జంటలుగా చేసి ఈ డాన్స్ షోని ఆర్గనైజ్ చేస్తున్నారు.
ఇక బిగ్ బాస్ హౌస్ లో కొట్లాటలు,మాటలతో రెచ్చిపోయిన కంటెస్టెంట్లు కూడా డ్యాన్స్ పర్ఫామెన్స్ లను ఇరగదీస్తున్నారు.ఇంతవరకు బాగానే ఉన్న ప్రతి వారం ఏదో ఒక మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
కంటెస్టెంట్ ల జడ్జిమెంట్ విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి.తాజాగా అలాంటి గొడవ ఒకటి జరిగింది.అయితే స్టేజ్ పై కాకుండా డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అర్జున్ కళ్యాణ్,మహబూబ్ మధ్య గొడవ జరిగింది.అసలేం జరిగిందంటే.బీబీ జోడి లో శ్రీసత్య, మెహబూబ్ ఒక జంట కాగా, అర్జున్ వాసంతిలు ఒక జంట.అయితే బాగా డ్యాన్స్ చేయడం కోసం వీళ్లందరూ కూడా ఎప్పటికప్పుడూ ప్రాక్టీసు చేస్తూనే ఉంటారు.అలా తాజాగా ఒకేచోట అర్జున్,వాసంతి, మెహబూబ్,శ్రీసత్య జంటలు ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది.కొంతసేపటివరకు అంత బాగానే జరిగింది.
కానీ ప్రాక్టీసు చేసే ప్లేస్ విషయంలో సడన్ గా మెహబూబ్,అర్జున్ గొడవపడ్డారు.దీంతో అక్కడే ఉన్న శ్రీసత్య వాళ్లిద్దరినీ వారించే ప్రయత్నం చేసింది.పైగా గొడవంత నీవల్లే నువ్వే అర్ధగంటలేటు వచ్చావు అనడంతో నామీద అరుస్తావేంటి అని అంటుంది శ్రీ సత్య.అయితే మెహబూబ్, అర్జున్ ఇద్దరూ మాట వినకపోయేసరికి అక్కడి నుంచి వెళ్లిపోవాలని చూసింది.
దీంతో చివరగా షాక్ ఇచ్చిన మెహబూబ్ ఇదంతా ప్రాంక్ అంటూ చల్లగా చెప్పుకొచ్చాడు.అప్పుడు శ్రీ సత్య షాక్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.