మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం మూవీ రీమేక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ కంప్లీట్ చేసిన తర్వాత మోహనకృష్ణ దర్శకత్వంలో లూసీఫర్ తో పాటు వేదాళం మూవీ షూటింగ్ ఒకేసారి స్టార్ట్ చేయాలని చిరంజీవి అనుకుంటున్నారు.
దానికి గాను ఇప్పటికే ఆయా చిత్రాల దర్శకులకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.ఇదిలా ఉంటే లూసీఫర్ రీమేక్ కోసం మోహన కృష్ణ ప్రస్తుతం క్యాస్టింగ్ ని ఫైనల్ చేసే ప్రయత్నంలో ఉన్నారు.
ఇక మెహర్ రమేష్ చాలా కాలం తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో ఎట్టి పరిస్థితిలో ఈ మూవీతో హిట్ కొట్టి మళ్ళీ స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం సొంతంచేసుకోవాలని అనుకుంటున్నాడు.
దానికోసం వేదాళం సినిమా షూటింగ్ లో చిరంజీవి ఇంకా జాయిన్ అవ్వకముందే ఏకంగా 30 లక్షలు సొంతం డబ్బులు ఖర్చు పెట్టి కొన్ని కీలక సన్నివేశాలని షూట్ చేశారు.మహా కుంభమేళా ఈ ఏడాది ఆరంభంలో జరిగిన సంగతి తెలిసిందే.సినిమాలో కుంభమేళా బ్యాక్ డ్రాప్ లో కీలక సన్నివేశాలు ఉన్నాయి.
అయితే వాటిలో చిరంజీవి పాల్గొనాల్సిన అవసరం లేదు.ఈ నేపధ్యంలో కుంభమేళా ఎపిసోడ్ మొత్తం షూట్ చేసి చిరంజీవి దగ్గర మార్కులు కొట్టేయాలని మెహర్ సొంత సొమ్ము ఖర్చు పెట్టుకొని కుంభమేళా సమయంలో వారణాసి వెళ్లి అక్కడ కీలక సన్నివేశాలని ఎంతో కష్టం మీద షూట్ చేశారు.
వీటిని తీసుకొచ్చి చిరంజీవికి కూడా చూపించడం జరిగిందని, మెగాస్టార్ మెహర్ రమేష్ కష్టాన్ని గుర్తించి ప్రసంశించినట్లు బోగట్టా.