బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు కంప్లీట్ చేసుకుని.నాల్గువ సీజన్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4 ఇంటి సభ్యులు మూడో వారాన్ని పూర్తి చేసుకోబోతున్నారు.ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ కాగా.
ముగ్గురు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు.అయితే ఈ వారం మరొకరు బ్యాగ్ సర్దేయనున్నారు.
ఈ వారం ఎలిమినేషన్కు కుమార్ సాయి, దేవి నాగవల్లి, మోనాల్ గజ్జర్, హారిక, లాస్య, మెహబూబ్, అరియానా గ్లోరీ నామినేషన్స్లో ఉన్నారు.వీరిలో మొదట కుమార్ సాయి ఎలిమినేట్ అవుతాడని ప్రచారం జరిగింది.
అదే సమయంలో ఇంటి సభ్యులందరూ అతడినే టార్గెట్ చేశారు.దీంతో ఒంటరిగా ఉంటున్న కుమార్ సాయిపై ప్రేక్షకుల్లో సింపథీ పెరిగిపోయింది.
సింపథీ ఓట్లను గెయిన్ చేసుకున్న కుమార్ సాయి.ఈ వారం ఎలిమినేషన్స్ నుంచి సేఫ్ అయినట్టు తెలుస్తోంది.
అయితే మొదటి నుంచి సైలెంట్ కనిపిస్తున్న బిగ్ బాస్ కండల వీరుడు మెహబూబ్.ఈ వారం ఉక్కు హృదయం టాస్క్లో ఓవరాక్షన్ ఓ రేంజ్లో చేసి.అడ్డంగా బుక్కైపోయాడు.దివి కిడ్నాప్ అయినప్పుడు లోపల ఎలాంటి సీను జరగకపోయినా.బయట ఉన్న మెహబూబ్ మాత్రం అభిజిత్, కుమార్ సాయిలను దారుణంగా దూషించాడు.అంతేకాదు, సినిమా డైలాగులు చెప్పి, కన్నీళ్లు కార్చేసి చివరకు ప్రేక్షకుల మదిలో బకరా అయ్యి.
వచ్చే ఓట్లను పోగొట్టుకున్నాడు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ లవర్స్ సైతం మెహబూబ్ కాస్త ఎక్కువ చేశాడని.పావలా టాస్క్కి ఐదు రుపాయిల పెర్ఫామెన్స్ ఇచ్చాడని రకరకాల కామెంట్లు చేశారు.ఇక మెహబూబ్ ఓవరాక్షన్ కారణంగా.
అతడి గ్రాఫ్ ఊహించని రీతిలో పడిపోయింది.ఈ క్రమంలోనే నేడు మెహబూబ్ బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ కాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
మరి మెహబూబ్ ఎలిమినేట్ అవుతాడా.సేఫ్ అవుతాడా మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది.
తాజా వార్తలు