బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైతం వివాదాస్పద షోగా పేరు తెచ్చుకుంది.అయితే ఈ షోపై కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేసినా ఈ షో ఎంతోమంది కంటెస్టెంట్లకు గుర్తింపుతో పాటు మంచి పేరును తెచ్చిపెట్టింది.
అలా ఈ షో ద్వారా గుర్తింపును సంపాదించుకున్న కంటెస్టెంట్లలో మెహబూబ్ ఒకరు.మెహబూబ్ దిల్ సే యూట్యూబ్ ఛానల్ ద్వారా బిగ్ బాస్ షోకు ముందు ప్రేక్షకులకు మెహబూబ్ సుపరిచితం.
అయితే తాజాగా మెహబూబ్ తనకు ఒక ఆంటీ వార్నింగ్ ఇచ్చారంటూ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.తాజాగా లైవ్ లోకి వచ్చిన మెహబూబ్ అలీరేజాతో కలిసి వైల్డ్ డాగ్ సినిమా చూసేందుకు వెళ్లానని తెలిపారు.
ఐమాక్స్ లో అంతా క్లాస్ వాళ్లే ఎక్కువగా ఉండటంతో థియేటర్ మొత్తం నిశ్శబ్దంగా ఉందని మెహబూబ్ చెప్పారు.అయితే మూవీలో అలీరేజా ఉన్న సన్నివేశాలు వచ్చిన సమయంలో తాను, సోహెల్ గట్టిగా అరిచామని మెహబూబ్ వెల్లడించారు.
తాము అలా చేయడంతో సినిమా చూడటానికి వచ్చిన మిగతా వాళ్లు తమ వైపు కోపంగా చూశారని ఒక ఆంటీ తమ వైపు చాలా కోపంగా చూసిందని మెహబూబ్ తెలిపారు.అయితే తాము మాస్కులు ధరించి ఉండటంతో ఎవరూ గుర్తు పట్టలేదని మెహబూబ్ పేర్కొన్నారు.
సినిమా ఇంటర్వెల్ సమయంలో ఆంటీ మమ్మల్ని గుర్తు పట్టి తాను మీరని అనుకోలేదని హైదరాబాద్ వాళ్లని అనుకున్నానని ఆంటీ చెప్పారని మెహబూబ్ వెల్లడించారు.
తాము ఎవరో తెలియక ముందు ఆంటీ కోపంగా వార్నింగ్ ఇస్తున్న విధంగా చూశారని మెహబూబ్ పేర్కొన్నారు.అలా వైల్డ్ డాగ్ మూవీ థియేటర్ లో జరిగిన ఘటన గురించి మెహబూబ్ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలతో బిజీగా ఉన్న మెహబూబ్ త్వరలో ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించబోతున్నారని తెలుస్తోంది.