కన్నడ సినీ నటుడు చిరంజీవి సర్జా.ఈయన గత ఏడాది జూన్ 7న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.
ఆయన మరణించి ఏడాది గడిచినా ఇప్పటివరకు ఆయన జ్ఞాపకాలు ఇండస్ట్రీలో కూడా తిరుగుతూనే ఉన్నాయి.తన కుటుంబ సభ్యులకు తీరని బాధను మిగిల్చి పోయాడు.
ఈయన 2009లో వాయుపుత్ర సినిమా తో వెండితెరకు పరిచయం అవగా ఆ తర్వాత కన్నడ స్టార్ గా నిలిచాడు.ఈయనకు 2018 అక్టోబర్ లో మరో నటి మేఘన రాజ్ తో వివాహం జరిగింది.
తన భర్త చనిపోయిన తర్వాత తను కోల్పోవడానికి ఎంతో సమయం పట్టింది.ఇంటినుండి బయటికి రాక అలాగే ఒంటరిగా జీవించింది.ఇక చిరంజీవి సర్జా చనిపోయి ఏడాది అవగా ఈ నేపథ్యంలో ఆయన మనశ్శాంతికి తొలి వర్ధంతి జరిపించారు కుటుంబ సభ్యులు.ఇక ఆయన భార్య మేఘన ఆయన జ్ఞాపకాలను మర్చిపోలేక ఓ పోస్ట్ షేర్ చేసింది.
అందులో తన భర్త, తాను మాట్లాడుకుంటుండగా తనను ఆమె తన భర్త చూస్తున్నా ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంది.
ఇక ఆ ఫోటోకు మన ప్రేమ నాది అంటూ ఓ క్యాప్షన్ పెట్టగా అందరి హృదయాలను కదిలించింది ఈ ఫోటో.ఇక ఈ ఫోటోను చూసిన పలువురు నటులు, నెటిజనులు ఎమోషనల్ తో స్పందించారు.తన భర్త చనిపోయే సమయానికి ఆమె ఐదు నెలల గర్భవతిగా ఉండగా అక్టోబర్ లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఇక ఆయనకు జూనియర్ చిరంజీవి అని పేరు కూడా పెట్టగా అభిమానులకు తన కొడుకును పరిచయం చేసింది మేఘన.
ఇదిలా ఉంటే ఆయన మరణం తర్వాత ఒంటరిగా జీవిస్తున్న మేఘన తను ఒక నిర్ణయం తీసుకుంది.తన జీవితంలో జరిగిన సంఘటన మర్చిపోవడానికి ఓ దారిని ఎంచుకుంది.అది కూడా తిరిగి ఆమె మళ్లీ సినిమాలలో నటించాలని అనుకుంది.
ఇక ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత కుటుంబ సభ్యులు కూడా సంతోష పడ్డారు.