ఎప్పుడో దశాబ్దం క్రితం బిల్లా, కంత్రి, షాడో సినిమాలతో తెలుగు ప్రేక్షకులని భయపెట్టిన దర్శకుడు మెహర్ రమేష్.ఆ సినిమాల తర్వాత మెహర్ టాలీవుడ్ లో కనిపించకుండా పోయాడు.
తన దర్శకత్వ టాలెంట్ తో తెలుగు ప్రేక్షకులని విపరీతంగా భయపెట్టిన మెహర్ రమేష్ సినిమా రంగంలోనే ఉన్న దర్శకత్వం జోలికి వెళ్ళలేదు.మెగా ఫ్యామిలీ సినిమా వ్యవహారాలు, వ్యాపారాలు చూసుకుంటూ వారితో పాటే ఉంటున్నాడు.
ఈ మధ్య మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో డిస్టిబ్యూటర్ అవతారం ఎత్తాడు.అయితే చిరంజీవి దయవల్ల మరల మెహర్ రమేష్ దర్శకుడుగా తిరిగి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.
అది కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాతోనే.
అసలు సినిమాల విషయంలో ఆచితూచి దర్శకులని ఎంపిక చేసుకునే మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ ని తన ఫ్యూచర్ దర్శకుల జాబితాలో చేర్చడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే ఇప్పుడు ఏకంగా అతనికి తనని దర్శకత్వం చేసే అవకాశం కూడా చిరంజీవి ఇచ్చినట్లు తెలుస్తుంది.తమిళంలో అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో వేదాళం సినిమా తెరకెక్కి సూపర్ హిట్ అయ్యింది.
ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యి రిలీజ్ అయ్యింది.అయితే ఈ సినిమా మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది.
ఇప్పటికే చిరంజీవి కూడా ఈ రీమేక్ కి ఒకే చెప్పెశాడని, కెఎస్ రామారావు క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారని బోగట్టా.మరి డిజాస్టర్ చిత్రాల దర్శకుడుగా టాలీవుడ్ పేరుపడ్డ మెహర్ రమేష్ చిరంజీవికి ఎలాంటి హిట్ ఇస్తాడు అనేది వేచి చూడాలి.