మంత్రి రోజాతో సెల్ఫీకి ఫోజులిచ్చిన మెగాస్టార్.. ఫోటో వైరల్!

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నేడు 125వ జయంతి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుతున్నారు.ఈ జయంతి ఉత్సవాలలో భాగంగా భీమవరంలో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

 Megastar Took A Selfie With Minister Roja Photo Viral , Chiranjeevi , Minister R-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఏపీ రాజకీయ నాయకులు అలాగే కొందరు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు.ఇకపోతే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం రావడంతో ఆయన భీమవరంలో సందడి చేశారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీ మంత్రి, సీనియర్ నటి రోజా కూడా పాల్గొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా విగ్రహవిష్కరణ జరిగిన అనంతరం మోడీ ప్రసంగించారు.

ఇక రోజా ఈ కార్యక్రమానికి రావడంతో అన్ని వ్యవహారాలు తానే దగ్గరుండి చూసుకున్నారు.ఇలా అతిథులను వేదికపైకి రోజా సాదరంగా ఆహ్వానం పలికారు.ఇకపోతే వేదికపై ఉన్నటువంటి వారితో రోజా సరదాగా మాట్లాడుతూ అందరితో సెల్ఫీ దిగారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో కూడా రోజా సెల్ఫీ దిగారు.ఇలా మంత్రి రోజాతో మెగాస్టార్ చిరంజీవి సెల్ఫీకి ఫోజులు ఇస్తూ ఉన్నటువంటి ఫోటోని రోజా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది.ఇకపోతే రోజా సినిమాలలోకి రాకముందు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి సందడి చేశారు.

వీరి కాంబినేషన్లో కూడా సూపర్ హిట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.చాలా కాలం తర్వాత రోజా చిరంజీవి ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో అభిమానుల సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube