మెగాస్టార్ చిరంజీవి గత వారంలో గుండుతో కనిపించి అందరికి షాక్ ఇచ్చాడు.అది నిజంగా నూరు శాతం గుండులా అనిపించింది.
ఆ గుండు ఏదైనా మొక్కు అయ్యి ఉంటుందా అనుకున్నారు.మరి కొందరు ఏదైనా సినిమా షూటింగ్ కోసమా అనుకున్నారు.
మరి కొందరు సరదాగా చేసుకున్నారేమో అనుకున్నారు.కాని అసలు విషయం ఏంటీ అంటే అది అసలు గుండే కాదు.
అది కేవలం మేకప్.రాబోయే రోజుల్లో ఒక సినిమా లో గుండుతో చిరంజీవి కనిపించాల్సి ఉందట.అందుకు ఇప్పుడే మేకప్ టెస్ట్ చేయించుకున్నాడు. చిరంజీవి గుండుతో కనిపించడం అంటే మామూలు విషయం కాదు.ఆ సినిమా ఏమై ఉంటుందా అంటూ ఇప్పటి నుండే చర్చ జరుగుతోంది.గుండుకు సంబంధించిన మేకప్ వీడియోను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.
ఎప్పుడెప్పు మళ్లీ చిరంజీవిని గుండుతో చూస్తామా అంటూ ఎదురు చూస్తున్నారు.
చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా ను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే.
ఆ సినిమాకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరిగి షూటింగ్ సగం వరకు పూర్తి అయిన సమయంలో కరోనా వచ్చింది.దాంతో మొత్తం నిలిచి పోయింది.ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉన్న కారణంగా షూటింగ్ కు వెళ్లాలి అంటే ఆచార్య యూనిట్ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.కొందరు ఏం పర్వాలేదు వెళ్దాం అంటూ షూటింగ్స్ కు వెళ్లున్నారు.
కాని కొందరు మాత్రం సాహసం చేయలేక పోతున్నారు. చిరంజీవి అక్టోబర్ లేదా నవంబర్ నుండి షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు.
అతి త్వరలోనే అందుకు సంబంధించిన ప్రకటన వస్తుందని ఆశిద్దాం.ఇక తదుపరి సినిమాగా వేదాళం రీమేక్ ను రమేష్ మెహర్ దర్శకత్వంలో చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు జరిగాయి.
వచ్చే ఏడాది ఆరంభం నుండి రీమేక్ పట్టాలెక్కబోతుంది.ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తాడని సమాచారం అందుతోంది.
అందుకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి.లూసీఫర్ రీమేక్ లో కూడా చిరంజీవి నటించాల్సి ఉంది.
అది 2022 లో ఉండే అవకాశం ఉందంటున్నారు.