సినిమాలు బాగుంటే అభినందించడంలో మెగా ఫ్యామిలీ ముందు వరుసలో ఉంటుంది.వాళ్ళ టాలెంట్ ను గుర్తించి వాళ్లకు ప్రశంసలు అందిస్తూ ఉంటారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ డైరెక్టర్ సంపత్ నంది పై ప్రశంసలు కురిపించారు.ప్రెసెంట్ ఆయన గోపిచంద్ తో సీటిమార్ సినిమా చేసిన విషయం తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమాను సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఎప్పటి నుండో ప్రమోషన్స్ చేస్తూ ఈ సినిమాను ప్రజలకు చేరువ చేసే పనిలో మేకర్స్ ఉన్నారు.
ఈ క్రమంలోనే సీటిమార్ నుండి ట్రైలర్ విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.తాజాగా మెగాస్టార్ సీటిమార్ ట్రైలర్ చూసి దీనిపై స్పందించారు.
మెగాస్టార్ చిరు ఈ ట్రైలర్ చూసి దీనిపై కామెంట్స్ చేసారు.
ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది.గ్రామీణ క్రీడ కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కించడం బాగుంది.
సంపత్ నంది నాకు చాలా కాలంగా తెలుసు.ఆయన సినిమాలు తీసే విధానం చాలా బాగుంటుంది.
మహిళలు కబడ్డీ ఆడితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో సంపత్ నంది చూపించబోతున్నాడు.ఇప్పటికే మహిళల విజయాలు పట్ల భారతదేశం గర్వంగా ఉంది.
ఇలాంటి కథలు ఇంకా తెరకెక్కాలి.ఇలాంటి సినిమాలు మరెన్నో వచ్చి ప్రజలను చైతన్యం చేయాలి.ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.అంటూ చిరు ట్వీట్ చేసారు.ఈ సినిమాలో గోపీచంద్ కు జంటగా తమన్నా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి.
ఇక ఈ సినిమా విడుదల అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో వేచి చూడాలి.