డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో గోపీచంద్, రాశి ఖన్నా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం పక్కా కమర్షియల్.ఈ సినిమా జులై 1వ తేదీ విడుదల కానుంది.
ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఆదివారం సాయంత్రం శిల్పకళావేదికలో ఎంతో ఘనంగా నిర్వహించారు.ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ డైరెక్టర్ మారుతికి ఊహించని విధంగా గిఫ్ట్ ఇచ్చారు.
మారుతి గురించి మెగాస్టార్ మాట్లాడుతూ తాను డైరెక్టర్ కాకముందు తాను ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సమయంలో పార్టీ లోగోని డిజైన్ చేశారని తెలిపారు.ప్రజారాజ్యం పార్టీ సాంగ్ కంపోజ్ చేసినప్పుడు అందుకు అనుగుణంగా విజువల్ షూట్ చేయడంతో ఆ సమయంలోనే తనలో దర్శకుడు అయ్యే క్వాలిటీస్ ఉన్నాయని, తనని డైరెక్షన్ డిపార్ట్మెంట్ వైపు వెళ్ళమని సలహా ఇచ్చానని మెగాస్టార్ తెలిపారు.
ఇప్పుడు మారుతి పెద్ద దర్శకుడయ్యాడు మున్ముందు ఇంకా పెద్ద దర్శకుడు అవుతారు అంటూ మారుతి గురించి మెగాస్టార్ వెల్లడించారు.ఇక వేదికపై మెగాస్టార్ మాట్లాడుతూ…యూవీ క్రియేషన్స్ విక్కీ, వంశీ ఇటీవల తనని కలిశారని, మీతో మారుతితో కలిసి ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాము అని చెప్పగానే ఎంతో సంతోషం అనిపించింది.మారుతి మా ఇంటి అబ్బాయి, ఒక అభిమానిగా నన్ను ఎలా చూపించాలో తనకు తెలుసు అందుకే మారుతితో సినిమా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఊహించని విధంగా మారుతికి హామీ ఇచ్చి తనని సర్ప్రైస్ చేశారు.ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమాల షూటింగ్ పూర్తి కాగానే మారుతి డైరెక్షన్లో మెగాస్టార్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.