మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ ను ఇప్పుడు పూజా కార్యక్రమాలతో భారీగా లాంచ్ చేసారు.
హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ రోజు ఉదయం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేసారు.ఈ వేడుకలో చిత్ర యూనిట్ తో పాటు పలువురు స్టార్స్ కూడా పాల్గొన్నారు.
సినీ ప్రముఖుల్లో మెగాస్టార్ చిరంజీవి తో పాటు లెజెండ్రీ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కూడా ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.వీళ్ళు లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యి తమ విషెష్ తెలిపారు.
ఈ క్రమంలో మొదటి సన్నివేశంలో రామ్ చరణ్ పై మెగాస్టార్ క్లాప్ కొట్టారు.రామ్ చరణ్ సూటు బూటు వేసుకుని స్టైలిష్ లుక్ లో ఉన్నాడు.
ఈ కార్యక్రమంలో కియారా అద్వానీ కూడా ఉన్నారు.చరణ్ కియారా పై చిరు క్లాప్ కొట్టారు.
ఈ సందర్భంగా ఈ రోజు #RC15 హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ అవుతుంది.ఈ కార్యక్రమంలో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.దీనికి సంబంధించిన వీడియో కూడా చక్కర్లు కొడుతోంది.మొదటి రోజునే పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా ప్రోమోట్ అయ్యింది.
ఇక పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.ఇప్పటికే ఈ లాంచ్ సందర్భంగా మేకర్స్ ఒక పోస్టర్ కూడా విడుదల చేసింది.ఇందులో ఈ చిత్ర యూనిట్ మొత్తం ఉండడం విశేషం.అందరు కూడా ఒకే కాస్ట్యూమ్ తో చేతిలో ఫైల్స్ పట్టుకుని చాలా స్టైలిష్ గా కనిపించారు.ఇక ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ ప్రచారంలో ఉంది.