మెగాస్టార్ చిరంజీవి దెయ్యంలా మారిపోయి జనాలను బయపెడు తున్నాడు.ఈయన సినిమా కోసమో, లేదంటే షూటింగ్ కోసమో దెయ్యం గా మారలేదు.
రియల్ గానే దెయ్యంగా మారి అందరిని బయపెడు తున్నాడు.అయితే మెగాస్టార్ దెయ్యంలా మారడానికి ఒక కారణం ఉంది.
నిన్న హాలోవీన్ సందర్భంగా సినీ ప్రముఖులు చాలా మంది సెలెబ్రేషన్స్ చేసుకున్నారు.
మెగాస్టార్ కూడా సోషల్ మీడియా వేదికగా హాలోవీన్ సందర్భంగా చేసిన ఫన్నీ వీడియోను షేర్ చేసుకున్నాడు.
ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఆయన సోషల్ మీడియాలో ‘హ్యాపీ హాలోవీన్’ అంటూ శుభాకాంక్షలు చెబుతూ ఈ వీడియోను షేర్ చేసాడు.చిరు మేక్ ఓవర్ పొందడానికి యాప్ ని ఉపదయో గించినట్టు ఆ వీడియో చుస్తే తెలుస్తుంది.
”ఉత్కంఠభరితమైన రోజు” అంటూ క్యాప్షన్ ను జోడించి ఈ వీడియోను షేర్ చేసాడు.ఈ వీడియో ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటుంది.ఇక చిరు తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఫాస్ట్ గా సినిమాలను పూర్తి చేస్తున్నాడు.
ప్రెసెంట్ చిరు కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమా చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల కాబోతుంది.
ఇక వీటితో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాను చేస్తున్నాడు.ఇది తమిళ సినిమా అయిన ‘వేదాళం’ సినిమాకు రీమేక్ గా వస్తుంది.ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరు కు చెల్లెలి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.దీంతో పాటు మోహన్ రాజా దర్శకత్వం లో గాడ్ ఫాదర్ సినిమాను చేస్తున్నాడు.
ప్రెసెంట్ ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ కూడా స్టార్ట్ చెయ్య బోతున్నారు.