కొన్నిరోజుల క్రితం వరకు గాడ్ ఫాదర్ సినిమాపై ఆశించిన స్థాయిలో అంచనాలు ఏర్పడలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఒక్క ఈవెంట్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి.
అయితె చిరంజీవి తాజాగా ట్విట్టర్ లో ఒక డైలాగ్ ను షేర్ చేయగా ఆ డైలాగ్ చర్చనీయాంశమైంది.అనంతపురంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి చెప్పిన ఈ డైలాగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
“ఇన్నాళ్లు రోడ్డు కాంట్రాకులు, ఇసుక కాంట్రాక్టులు, మద్యం కాంట్రాక్టులు, కొండ, నేల, నీరు కాంట్రాక్టులు అంటూ ప్రజల సొమ్మును తిని ఒక్కొక్కళ్లు బలిసి కొట్టుకుంటున్నారు.ఇకనుంచి మీరు పీల్చే గాలి కాంట్రాక్ట్ నేనే తీసుకుంటున్నా ఇందులో ఒకటే రూల్.
ఇకనుంచి ప్రజలకు సుపరిపాలన అందించాలనే నిర్ణయం.తప్పు చేయాలంటే భయం మాత్రమే మీ మనసుల్లో ఉండాలి.
లేదంటే మీ ఊపిరి గాల్లో కలిసిపోతుంది అనే డైలాగ్ చెప్పారు.
చిరంజీవి వైసీపీని ఉద్దేశించి ఈ డైలాగ్ చెప్పారంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.లక్ష్మీ భూపాల్ ఈ డైలాగ్ ను రాయగా ఈ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.గాడ్ ఫాదర్ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాల్సి ఉంది.
సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ షేక్ కావడం గ్యారంటీ అని చెప్పవచ్చు.డ్ ఫాదర్ హిట్ గా నిలవడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మెగా ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కగా నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవడం ఈ సినిమాకు ప్లస్ అయింది.