మొదట్లో ఎలాంటి సినిమా కుటుంబ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకుగా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టి మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న “టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.మెగాస్టార్ చిరంజీవి సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో తన ఇద్దరి తమ్ముళ్లను కూడా ఎంతగానో ప్రోత్సహించాడు.
దీంతో మెగా బ్రదర్ నాగబాబు నటుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక మెగాస్టార్ చిరంజీవి మరో తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతూ ఇటు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీని స్థాపించాడు.
దీంతో మెగా వారసులు దాదాపుగా క్రికెట్ టీమ్ కి సరిపోయేంత మంది టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోలుగా రాణిస్తున్నారు.
తాజాగా మెగా ఫ్యామిలీ కి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది.
అయితే ఆ ఫోటో ను ఒకసారి పరిశీలించినట్లయితే మెగాస్టార్ చిరంజీవి తల్లిదండ్రులు కొణిదల వెంకట రావు, అంజనా దేవిలతో సహా ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు, మరియు వారి కొడుకులు, కూతుళ్లతో సహా గ్రూప్ ఫోటో కళకళలాడుతోంది.దీంతో ఈ మెగా ఫ్యామిలీ ఫోటోని అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.
అంతేకాక ఒకే ఫ్రేమ్ లో మెగా కుటుంబం చూడ చక్కగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తెలుగులో “ఆచార్య” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు “కొరటాల శివ” దర్శకత్వం వహిస్తున్నాడు.ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయానికొస్తే దాదాపుగా మూడేళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో “వకీల్ సాబ్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి.ఇక వరుణ్ తేజ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న “గని” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తరహాలో ఉండనుంది.కాగా సాయి ధరమ్ తేజ్ విషయానికొస్తే “రిపబ్లిక్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల కాగా మంచి స్పందన లభించింది.