ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని శర్వానంద్ శ్రీకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.మార్చి 11వ తేదీన శ్రీకారం సినిమా విడుదల కానుండగా నిన్న ఖమ్మంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.శర్వానంద్ కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.చిరంజీవి మాట్లాడుతూ 12 సంవత్సరాల క్రితం ఖమ్మం జిల్లాలో రాజకీయ ప్రచారం చేసిన రోజులు గుర్తొచ్చాయని అన్నారు.
ప్రజల అభిమానం అప్పటికీ ఇప్పటికీ చెక్కు చెదరలేదని ఖమ్మం జిల్లా ప్రజలకు తాను తల వంచి నమస్కరిస్తున్నానని చిరంజీవి అన్నారు.రామ్ చరణ్ ఫోన్ చేసి శ్రీకారం ప్రీరిలీజ్ ఈవెంట్ కు రావాలని అడిగాడని శ్రీకారం యూనిట్ తాను ఖమ్మంలో ఉండటంతో వాళ్లు ఖమ్మంకు వస్తారని చెప్పారని మెగాస్టార్ పేర్కొన్నారు.
శ్రీకారం మూవీలో కమర్షియల్ హంగులతో పాటు మంచి మెసేజ్ కూడా ఉందని శ్రీకారం ప్రీరీలీజ్ ఈవెంట్ కు హాజరు కావడానికి శర్వా కూడా ఒక కారణమని చిరంజీవి పేర్కొన్నారు.తనకు శర్వా బిడ్డలాంటివాడని మరో చరణ్ అని చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పెరిగాడని చిరంజీవి తెలిపారు.శర్వా చాలా సాత్వికుడని శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో గెస్ట్ క్యారెక్టర్ చేసిన సమయంలోనే శర్వానంద్ పెద్ద యాక్టర్ అవుతాడని తనకు అనిపించిందని చిరంజీవి పేర్కొన్నారు.
శ్రీకారం సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని శర్వానంద్ అన్నారు.
మంచి సందేశం ఉన్న సినిమా అని యువతకు వ్యవసాయం విలువ తెలిసే విధంగా ఈ సినిమా ఉందని చిరంజీవి వెల్లడించారు.శ్రీకారం సినిమా సక్సెస్ సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చిరంజీవి తెలిపారు.