మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.ఈ ఎన్నికల ఫలితాల గురించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు.
చిన్నచిన్న పదవుల కొరకు తిట్టుకోవడం, కొట్టుకోవడం అవసరం లేదని చిరంజీవి తెలిపారు.పదవులు తాత్కాలికమని చిరంజీవి చెప్పుకొచ్చారు.
మనమంతా కలిసికట్టుగా ఉండాలని చిరంజీవి పిలుపునిచ్చారు.మనల్ని మనం తిట్టుకోవడం వల్ల బయటి వ్యక్తులకు చులకన అవుతున్నామని చిరంజీవి పేర్కొన్నారు.
వివాదాలు పుట్టించిన వ్యక్తులను దూరంగా ఉంచాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పరువు తీయవద్దని చిరంజీవి కోరారు.మనమంతా వసుధైక కుటుంబం అని చిరంజీవి చెప్పుకొచ్చారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.మాటలు అనడం అనిపించుకోవడం సరికాదని మెచ్యూరిటీతో వ్యవహారించాలని చిరంజీవి చెప్పారు.
పెళ్లిసందడి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ చిరంజీవి ఈ విషయాలను వెల్లడించారు.
ఎన్నికలకు ముందు వివాదాల గురించి మాట్లాడని చిరంజీవి ఎన్నికల ఫలితాల తర్వాత మాట్లాడటంతో పాటు ప్రచారం జరిగిన తీరు గురించి తన అభిప్రాయాన్ని చిరంజీవి చెప్పుకొచ్చారు.చిరంజీవి చేసిన కామెంట్ల గురించి నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.పదవి కోసం లోకువ కాకూడదని చిరంజీవి చేసిన కామెంట్లు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
వివాదానికి ఎవరు కారణమో ఆలోచించాలని చిరంజీవి పేర్కొన్నారు.
ఆప్యాయంగా, ఆత్మీయంగా, హాయిగా ఉండాలని చిరంజీవి కామెంట్లు చేశారు.చిరంజీవి ప్రకాష్ రాజ్ కు మద్దతు ప్రకటించినప్పటికీ బహిరంగంగా మాత్రం ఆ విషయాన్ని వెల్లడించలేదు.మంచు విష్ణు విజయం సాధించడంతో ప్రకాష్ రాజ్ బాధ పడుతున్నట్టు కొన్ని మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రకాష్ రాజ్ కు ఎన్నికల్ ఫలితాలు భారీ షాక్ అనే చెప్పాలి.చిరంజీవి ఓటు వేసిన సమయంలో కూడా మీడియాపై సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే.విభేదాలు ఉంటే పరిష్కరించుకోవాలని చిరంజీవి కోరడం గమనార్హం.