మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు.ఆచార్య సినిమా తర్వాత గ్యాప్ లేకుండా ముగ్గురు దర్శకులని ఫైనల్ చేసి వారితో స్క్రిప్ట్ వర్క్ కూడా చేయిస్తున్నాడు.
ఇందులో రెండు సినిమాలు రీమేక్ మూవీలు కావడం విశేషం.మోహన్ కృష్ణ దర్శకత్వంలో మలయాళీ హిట్ మూవీ లూసీఫర్ రీమేక్ చేస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభించడానికి రెడీ అవుతున్నాడు.మరో వైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ కూడా సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు.
ఈ రెండు సినిమాలతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ లో బాబీ దర్శకత్వంలో ఒక స్ట్రైట్ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా ప్రస్తుతం జరుగుతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాని వేదాళం కంటే ముందుగానే స్టార్ట్ చేసే యోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే బాబీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి చిరంజీవికి కూడా నేరేట్ చేయడం జరిగిందని టాక్ వినిపిస్తుంది.
మెగాస్టార్ కథలో కొన్ని కొన్ని మార్పులు సూచించి ఫైనల్ చేశారని ఈ నేపధ్యంలో క్యాస్టింగ్ పై బాబీ దృష్టిపెట్టినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హాని తీసుకునే యోచనలో దర్శకుడు బాబీ ఉన్నాడని తెలుస్తుంది.
ఇప్పటికే ఈ భామకి సినిమాలో ఆమె పాత్రని నేరేట్ చేయడం జరిగిందని, ఆమె కూడా మెగాస్టార్ చిరంజీవితో నటించడానికి ఆసక్తిగానే ఉన్నట్లు బోగట్టా.గతంలో లింగ సినిమాలో ఈ భామ సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఆడిపాడిన సంగతి తెలిసిందే.
ఈ నేపధ్యంలో ఇప్పుడు మెగాస్టార్ తో కూడా నటిస్తే సీనియర్ హీరోల పక్కన నటించిన బ్యూటీగా అరుదైన గుర్తింపు వస్తుంది.ఇక మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆమె నటించడం పక్కా అని తెలుస్తుంది.