మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ డైరక్షన్ లో వచ్చిన సినిమా కొండపొలం.శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ షో చూసిన మెగాస్టార్ అందరికంటే ముందే రివ్యూ ఇచ్చేశారు.ఇంతకీ కొండపొలం చూసి చిరు ఏమన్నారు అంటే.ఒక అందమైన ప్రేమకథతో అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు.
క్రిష్ ఎప్పుడూ విభిన్న కథలను ఎంచుకుంటాడు.అంతేకాదు నటీనటుల దగ్గర నుండి తనకు కావాల్సిన నటనను రాబట్టుకుంటాడు.
ఈ సినిమా అవార్డులు, రివార్డులు అందుకుంటుందని నమ్ముతున్నా అంటూ చిరు ట్వీట్ చేశారు.
సినిమా చూసిన అనంతరం డైరక్టర్ క్రిష్, హీరో వైష్ణవ్ తేజ్ తో చిరు దిగిన ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి ఈ రేంజ్ లో రివ్యూ ఇచ్చాడు అంటే ఖచ్చితంగా కొండపొలం సినిమాలో మ్యాటర్ ఉన్నట్టే ఉంది.ఉప్పెన సినిమాతో మొదటి సినిమానే సూపర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్ తన సెకండ్ సినిమాగా కొండపొలం తో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.
చిరు స్పందనతో కొండపొలం టీం లో ఫుల్ జోష్ వచ్చింది.తప్పకుండా చిరు ఇచ్చిన రెస్పాన్స్ లానే శుక్రవారం ప్రేక్షకుల నుండి మంచి స్పందన తెచ్చుకునే అవకాశం ఉందని అంటున్నారు.