మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.
ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది.ఈ సినిమా తర్వాత మలయాళం సూపర్ హిట్ మూవీ లూసీఫర్ లో చిరంజీవి నటిస్తాడని టాక్ వచ్చింది.
ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి ఈ విషయాన్ని మీడియాలో మాట్లాడుతూ రివీల్ చేశారు.తన నెక్స్ట్ సినిమా లూసీఫర్ అని చెప్పేసాడు.
దీనికోసం ఇప్పటికే ఓ ఐదు మంది దర్శకులని పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాని పవన్ కళ్యాణ్ చేస్తాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది అంటూ మీడియా వారు అడిగిన ప్రశ్నకి బదులుగా చిరంజీవి మాట్లాడుతూ ఈ విషయం తన దృష్టికి ఇంకా రాలేదని, ఒక వేళ చేస్తానంటే మాత్రం కచ్చితంగా వదిలేస్తా అని చెప్పారు.
ప్రస్తుతానికి తమ మధ్య అలాంటి ప్రస్తావన అయితే రాలేదని స్పష్టం చేశారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుసగా మూడు సినిమాలకి కమిట్ అయ్యి ఉన్న నేపధ్యంలో ఈ సినిమా చేసే అవకాశం లేదని తెలుస్తుంది.