అలనాటి అందాల తార, విలక్షణ నటి సావిత్రి జీవిత గాథను కళ్ళకు కట్టినట్లు దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాడు.అంతేగాక ఇప్పుడున్న తరం వారికి అప్పట్లో సావిత్రి ఒక నటిగా మాత్రమే తెలుసు.
కానీ మహానటి చిత్రం తర్వాత చూసిన తర్వాత ఆమె జీవితంలో ఎదుర్కొన్న ఎటువంటి ఒడిదుడుకులు కష్టాలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.అంతలా నాగ అశ్విన్ తన దర్శకత్వ చాతుర్యంతో మాయ చేశాడు.
అయితే మహానటి చిత్రం తర్వాత దర్శకుడు నాగ అశ్విన్ కథల విషయంలో మరింత జాగ్రత్త వహిస్తున్నాడు.ఇందులో భాగంగానే ఓ సైన్స్ ఫిక్షన్ అంశానికి సంబంధించి నటువంటి కథను సిద్ధం చేసుకొని మెగాస్టార్ చిరంజీవికి వినిపించారు.
అయితే కథ మొత్తం విన్నటువంటి మెగాస్టార్ ఈ చిత్రం తనకంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి అయితే చాలా బాగుంటుందని ప్రభాస్ కి రిఫర్ చేశాడు.దీంతో మెగాస్టార్ రెఫరెన్స్ ని గౌరవించి కథ విన్న టువంటి ప్రభాస్ కూడా వెంటనే ఓకే చెప్పాడు.
అంతేగాక ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించేందుకు ముందుకు వచ్చింది.దీంతో నిన్నటి రోజున నాగ్ అశ్విన్ ప్రభాస్ తో చిత్రం చేస్తున్నట్లు కూడా ప్రకటించారు.
దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
అయితే ప్రస్తుతం ప్రభాస్ ప్రముఖ దర్శకుడు కె కె రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న టువంటి జాన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడు.
అయితే ఈ చిత్రం విడుదల అనంతరం నాగ్ అశ్విన్ తన ప్రాజెక్టుని పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది.