తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఎంతో కష్టపడి మెగాస్టార్ గా నిలిచిన చిరంజీవి గురించి ఆయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే.ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు.
యంగ్ హీరోలతో పోటీగా దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు చిరంజీవి.
ఇక ఈయన గతంలో మానసికంగా చాలా కుంగిపోయిన రోజులు ఉన్నాయట.
తెలుగు సినీ ఇండస్ట్రీకి కొణిదెల శివశంకర వరప్రసాద్ గా అడుగు పెట్టి మెగాస్టార్ చిరంజీవి గా నిలిచాడు.1878 లో పునాది రాళ్లు అనే సినిమాతో మొదటిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.ఈ సినిమా కంటే ముందు ప్రాణం ఖరీదు అనే సినిమా విడుదలయింది.
అలా తన తొలి నటనతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి ఇప్పటివరకు ఏడాదికి వరుస సినిమాలతో అవకాశాలు అందుకుని 150కి పైగా సినిమాలలో నటిస్తున్నాడు.
ఇక ఈయన గతంలో మానసికంగా చాలా కుంగిపోయాడట.కెరీర్ లో సొంతంగా మంచి సక్సెస్ లు అందుకున్న చిరంజీవిని చూసి అల్లు రామలింగయ్య తన కూతురునిచ్చి పెళ్లి చేశాడు.అలా మంచి గౌరవం ఉన్న కుటుంబానికి అల్లుడైన చిరంజీవి ఆ తర్వాత స్టార్ గా నిలిచి.
వ్యక్తిగతంగా, కుటుంబపరంగా తన జీవితం మంచిగా సాగుతున్న సమయంలో తనకు ఎదురు దెబ్బ తగిలింది.అప్పటికే తన కూతుర్లు, కొడుకు పెద్దవాళ్ళు కావడం పైగా కూతుర్లు పెళ్లీడుకు రావడంతో.
తన రెండో కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమ పెళ్లి చేసుకుంది.ఆ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారడంతో చిరంజీవి ఎంతో కష్టపడి తెచ్చుకున్న పేరును బయటకు వేసింది తన రెండో కూతురు.
అదే సమయంలో చిరంజీవి రాజకీయపరంగా ప్రజారాజ్యం పార్టీ కూడా స్థాపించాడు.
ఇక ఆ సమయంలో కొందరు రాజకీయ నాయకులు చిరంజీవిని వ్యతిరేకంగా విమర్శించారు.నీ కూతురు ఇలా చేసింది అంటూ.ఇంట్లో ఉన్న నీ కూతురిని సరిగ్గా పెంచలేదు అటువంటిది ప్రజలను ఏం పాలిస్తావని అనడంతో మానసికంగా చాలా కృంగిపోయాడు చిరంజీవి.
దాంతో చిరంజీవి తన గౌరవాన్ని మొత్తం పోగొట్టుకోగా.అదే సమయంలో రామ్ చరణ్ ఇండస్ట్రీకి హీరోగా అడుగుపెట్టాడు.
దాంతో రామ్ చరణ్ మంచి మంచి కథలను ఎంచుకొని తన తొలి సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకొని తండ్రికి తగ్గట్టు తనయుడు గా నిలిచాడు.దీంతో అప్పటి నుండి చిరంజీవి రామ్ చరణ్ సక్సెస్ లను తన సక్సెస్ లు అనుకోని మానసికంగా ఉత్సాహంగా మారాడు.అలా గతంలో మానసికంగా కుంగిపోయిన చిరంజీవికి చరణ్ ఆయుధం లా వచ్చి పేరు సంపాదించుకోవడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు చిరంజీవి మళ్లీ ఏ రోజు కూడా తన వ్యక్తిగత జీవితంలో మానసికంగా కుంగిపోలేదు.ఇక ఇప్పటికీ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉండగా ప్రస్తుతం ఆయన ఆచార్య సినిమాలో తన కుమారుడు రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత గాడ్ ఫాదర్, భోళా శంకర్ అంతేకాకుండా బాబీ దర్శకత్వంలో కూడా మరో సినిమాలో నటించనున్నాడు చిరు.