టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యసినిమా చేస్తున్నాడు.కొరటాల శివ సామజిక అంశాన్ని ఎంచుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాలో చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ మధ్య వచ్చే సీన్స్ చాలా బాగుంటాయని ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని కొరటాల శివ తెలిపారు.
ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా కాజల్, రామ్ చరణ్ కు జోడిగా పూజ హెగ్డే నటిస్తున్నారు.ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.
కరోనా కారణంగా వాయిదా పడిన షూటింగ్ త్వరలోనే రీస్టార్ట్ కాబోతుంది.చివరి షెడ్యూల్ తొందరగా పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా పెట్టి తర్వాత సినిమాలు చేయాలనీ చిరంజీవి అనుకుంటున్నాడు.
చిరంజీవి ఆచార్య సినిమా తర్వాత రెండు రీమేక్ సినిమాలను లైన్లో పెట్టాడు.లూసిఫర్, వేదాళం అనే రెండు రీమేక్ సినిమాల్లో చిరంజీవి నటించబోతున్నాడు.ముందుగా లూసిఫర్ సినిమా మొదలు పెట్టబోతున్నాడు.రామ్ చరణ్ తో ధృవ సినిమా చేసిన మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.మోహన్ రాజా తెలుగు వాడైనా తమిళంలో వరస సినిమాలు చేసి హిట్స్ అందుకున్నాడు.
అయితే ఈ సినిమాపై డైరెక్టర్ తాజాగా ఒక అప్డేట్ అందించాడు.ఈ సినిమాకు మ్యూజికల్ సెట్టింగ్స్ కూడా స్టార్ట్ చేసినట్టు సంగీత దర్శకుడు థమన్ తెలిపాడు.ఈ విషయంపై మోహన్ రాజా స్పందిస్తూ ఈ సినిమాపై చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నట్టు తెలిపాడు.
థమన్ కూడా ఈ సినిమాకు అద్భుతంగా సంగీతం అందిస్తున్నాడని ఆయన తెలిపాడు.అంతేకాదు ఈ సినిమా షూట్ ను అతి త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నట్టు కూడా తెలిపాడు.