మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ కి సంబందించిన ఓ మంచి డెసిషన్ డిస్కషన్స్ లోకి వచ్చింది.అదేంటి అంటే ఈమధ్య ప్రేక్షకులు సినిమాలు థియేటర్ లో చూడకపోవడానికి ముఖ్య కారణం సినిమాలు ఆసక్తిగా లేకపోవడం ఒకటి.
మరోటి టికెట్ రేట్లు పెంచడం కూడా.అయితే ఈమధ్య వచ్చిన హిట్ సినిమాలు టికెట్ రేట్లని తగ్గించి హిట్ అందుకున్నారు.
ఇప్పుడు మెగా మూవీ గాడ్ ఫాదర్ కి కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నారట.చిరు సినిమా అంటే బాక్సాఫీస్ లు షేక్ అవ్వాల్సిందే.
కానీ పరిస్థితులు మారాయి.
ఆచార్య ఇచ్చిన షాక్ తో మెగాస్టార్ కూడా ఆలోచనలో పడ్డారు.
ప్రేక్షకులకు తక్కువ రేట్ల్కే టికెట్లు దొరికేలా ప్లాన్ చేశారు.అక్టోబర్ 6న గాడ్ ఫాదర్ మెయిన్ థియేటర్ సుదర్శన్ 35 ఎం.ఎం కి బాల్కాని టికెట్ 150 మాత్రమే చూపిస్తుంది.ఫస్ట్ డే కూడా దాదాపు అంతే ఉండొచ్చు.
సో అన్నిచోట్ల తగ్గించిన ఈ టికెట్ల రేట్లే అందుబాటులో ఉండేలా చేస్తున్నారు.మరి ఇది సినిమా రిజల్ట్ మీద ప్రభావం చూపిస్తుందా లేదా అన్నది చూడాలి.
ఆచార్య ఫ్లాప్ తర్వాత చిరు ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు.