ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తూ రోజు రోజుకి తన ప్రతాపాన్ని చూపిస్తూ విజృంభిస్తోంది.ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దేశ వ్యాప్తంగా వైద్యులు, పోలీసులు మరియు పారిశుద్ధ కార్మికులు తదితరులు నిరంతరంగా శ్రమిస్తుంటే మరోవైపు ఈ కరోనా వైరస్ గురించి ప్రముఖ సినీ సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల అవగాహన కల్పిస్తున్నారు.
ఇందులో భాగంగా కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ప్రజలకు క్షుణ్ణంగా వివరిస్తున్నారు.
అయితే తాజాగా ఈ కరోనా వైరస్ వ్యాప్తి గురించి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరియు తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ కరోనా వైరస్ రాకుండా మాస్కులు ధరించాలని చెబుతూ ఓ వీడియోని రూపొందించి తమ అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విడుదల చేశారు.
అయితే ఇందులో మెగాస్టార్ చిరంజీవి ముఖం అందంగా కనిపించాలంటే చిరునవ్వు ఎంత అవసరమో… ప్రస్తుతం కలకలం సృష్టిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముఖానికి మాస్కు కూడా అంతే అవసరమని కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి మాస్కులు ధరించాలని వీడియో ద్వారా పిలుపునిచ్చాడు.మెగాస్టార్ చిరంజీవి చేసినటువంటి ఈ వీడియో కి ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో మంచి రెస్పాన్స్ వస్తోంది.
అంతేగాక పలువురు సినీ సెలబ్రిటీలు మరియు స్టార్ హీరోలు ఈ వీడియోని రీట్వీట్ చేస్తూ మెగాస్టార్ కి మద్దతు తెలుపుతున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న “ఆచార్య” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి పలు చిత్రీకరణ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.అలాగే యంగ్ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఓ మలయాళ చిత్ర రీమేక్ లో కూడా మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.