ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకుగా సినిమా పరిశ్రమకు వచ్చి మొదటగా చిన్న చిన్న పాత్రలలో నటించే అవకాశాలు దక్కించుకొని ఆ తర్వాత మెగాస్టార్ గా ఎదిగి నెంబర్ వన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న “టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి” గురించి సౌత్ ఇండియాలో తెలియని వారుండరు.అందుకే మెగాస్టార్ చిరంజీవి చాలా మంది యువ నటీనటులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి కేవలం నటుడిగా మాత్రమే కాకుండా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పనిచేశారు.అయితే మళ్ళీ 2017వ సంవత్సరం లో “ఖైదీ నెం150” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా రీ-ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి కి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది. అయితే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఓ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో చిరంజీవితో పాటు అతడి సతీమణి సురేఖ వాణి మరియు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అలాగే కూతురు సుస్మిత కొణిదెలతో కలిసి తీసుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది. అంతే గాక ఈ ఫోటో పై కొందరు మెగా అభిమానులు స్పందిస్తూ చిన్నప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ చాలా క్యూట్ గా ఉన్నాడని, అలాగే ఓకే ఫ్రేమ్ లో రెండు సింహాలు… అంటూ మెగా అభిమానులు తమ అభిమాన నటుడిపై కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి తెలుగులో “సైరా నరసింహా రెడ్డి” అనే చిత్రంలో హీరోగా నటించాడు. కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
దీంతో ప్రస్తుతం చిరు తెలుగులో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న “ఆచార్య” అనే చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ దాదాపుగా అరవై శాతం పూర్తయినట్లు సమాచారం.
కాగా ఇటీవలే చిరంజీవి మలయాళంలో మంచి విజయం సాధించిన “లూసిఫర్” చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి నలుగురు దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం.
.