టాలీవుడ్లో స్వశక్తితో ఎదిగినటువంటి హీరోలు ఎవరంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.అయితే మెగాస్టార్ చిరంజీవి తన సినీ ప్రస్థానంలో అన్న ఒడిదుడుకులు ఎదుర్కొంటూ పైకి ఎదగడమే కాకుండా కోట్ల మంది ప్రజల అభిమానాన్ని కూడా సంపాదించుకున్నారు.
అందుకే ఇప్పటి తరం యంగ్ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు మెగాస్టార్.అయితే ఈ మధ్యకాలంలో లో కొన్ని విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
అయితే ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కాలంలో ఓ ఛానెల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఇందులో భాగంగా తన జీవితంలోని ఓ చేదు సంఘటన గురించి చెప్పుకొచ్చాడు.
అయితే సినిమా పరిశ్రమకి వచ్చిన కొత్తలో తాను చెన్నై లో నివాసం ఉండే వాడినని అయితే ఎప్పుడు ఇరుకుగా జనాలతో కిటకిటలాడుతుండే పాండీ బజార్ కి మాత్రం వెళ్లాలంటే మాత్రం కొంచెం సంకోచించే వాడినని చెప్పుకొచ్చాడు.అయితే అందుకు వివరణ ఇస్తూ అక్కడ అవకాశాలు రాక కొంత మంది ఉంటే, వచ్చిన అవకాశాల్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోని మరికొందరు ఉంటారని అంతేకాక ఎప్పుడూ చిరాకు పడుతూ జనాలను హేళన చేస్తూ మాట్లాడుతుంటారని అన్నారు.
అయితే తాను పని నిమిత్తమై ఓసారి ఈ పాండీ బజార్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు నవ్వుతూ నువ్వు సినిమా యాక్టర్ అవుతావా ఒకసారి వెళ్ళి నీ మొహం అద్దంలో చూసుకో అంటూ హేళన చేసి మాట్లాడారట.దీంతో మెగాస్టార్ చిరంజీవి వెంటనే అక్కడి నుంచి వచ్చేసి కొంతసేపు ఆ మాటలకి బాధ పడినప్పటికీ తర్వాత దారిన పోయే వాళ్ళ మాటలు పట్టించుకుంటూ పోతే ఎదగలేమని మన పని మనం చేసుకుంటూ మన స్వశక్తితో ముందుకెళితే కచ్చితంగా విజయం వరిస్తుందని తనలో తానే సర్ది చెప్పుకున్నా డట.అయితే ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కి వరుస ఆఫర్లు రావడంతో వాటిని సద్వినియోగం చేసుకుంటూ టాలీవుడ్ నెంబర్ వన్ హీరో గా ఎదిగాడు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న”ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్నాడు.
ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష నటిస్తోంది.అయితే ఇప్పటికే ఈ చిత్రంలోని పలు కీలక సన్నివేశాలు చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం.తొందర్లోనే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి కీలక అప్ డేట్ ని విడుదల చేస్తున్నట్లు దర్శకుడు కొరటాల శివ ఇటీవలే చెప్పుకొచ్చాడు.