టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
ఈ నేపధ్యంలో మెగాస్టార్ చిరంజీవి మరో ఏడాది వరకు ఫుల్ బిజీ షెడ్యూల్ లో ఉన్నారు అని చెప్పాలి.అయితే చిరంజీవి ఎంత బిజీగా ఉన్న ఇండస్ట్రీలో తన సన్నిహితుల సినిమాలకి ఏదో ఒక విధంగా తన మాట సాయం గాని, లేదంటే ప్రమోషన్ ఈవెంట్స్ కి వచ్చి టీంకి స్ఫూర్తి నింపడం చేస్తూ ఉంటారు.
దాసరి తర్వాత ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద దిక్కుగా చిరంజీవి ఇప్పుడు ఉన్నారని చెప్పాలి.దీంతో చాలా మంది చిరంజీవి బ్లెస్సింగ్ కోసం అతనిని కలుస్తూ విషెస్ తీసుకుంటూ ఉన్నారు.
తాజాగా రాఘవలారెన్స్ కాంచన 3 వేడుకకి చిరుని చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేసారు.అయితే షూటింగ్ షెడ్యూల్ కారణంగా దానికి రాలేకపోయిన లారెన్స్ ని తన విషెస్ అందించారు.
ఇక లారెన్స్ కూడా కాంచన సినిమా ప్రమోషన్ లో చిరంజీవి ఇమేజ్ ని గట్టిగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసాడు.ఇప్పుడు చిరంజీవికి ఠాగూర్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన సన్నిహితుడు, నిర్మాత ఠాగూర్ మధు కోసం కుర్ర హీరో నిఖిల్ కొత్త సినిమా అర్జున్ సురవరం సినిమా ప్రమోషన్ ఈవెంట్ కి రావడానికి రెడీ అయినట్లు టాక్ వినిపిస్తుంది.
అర్జున్ సురవరం ప్రీరిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వస్తే సినిమాకి అదనపు ప్రమోషన్ దొరికే అవకాశం ఉంటుంది అని చెప్పాలి.