మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు.తనను అభిమానించే ప్రతి ఒక్కరిని కూడా అక్కున చేర్చుకుంటారు అనడంలో సందేహం లేదు.
ప్రతి ఒక్కరి పట్ల అభిమానం మరియు ఇష్టంను చూపించే చిరంజీవి తన అభిమానుల కోసం ఎన్నో సార్లు ఎన్నో కార్యక్రమాల్లో హాజరు అయ్యాడు.తనను చూడ్డానికి వెళ్లిన అభిమానులను కాని… ఆయన సాయం కోసం వెళ్లిన అభిమానులు కాని ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా వెను దిరిగేలా ఆయన సాయం చేస్తాడు అనేది టాక్.
అది చాలా మంచి పరిణామం అంటూ అభిమానులు అనుకుంటూ ఉంటారు.తాజాగా చిరంజీవి మరోసారి మంచి మనసు చాటుకున్నాడు.
చిరంజీవి తనకు పెద్ద అభిమాని అయిన కార్తికేయ వివాహం కు వెళ్లి నూతన వధు వరులను ఆశీర్వదించాడు.గతంలో పలు సందర్బాల్లో నేను ప్రాణానికి ప్రాణంగా అభిమానించే హీరో చిరంజీవి అంటూ ఆర్ ఎక్స్ 100 హీరో అయిన కార్తికేయ చెప్పుకొచ్చాడు.
ఆ అభిమానంతోనే చిరంజీవిని పెళ్లికి కార్తికేయ ఆహ్వానించాడట.చిరంజీవి వచ్చే విషయంలో అతడికి నమ్మకం ఉందా లేదా అనేది తెలియదు కాని చిరంజీవి ఆ దంపతులను ఆశీర్వదించేందుకు వచ్చి అందరికి షాక్ ఇచ్చాడు.
మెగాస్టార్ చిరంజీవి ఈమద్య కాలంలో అన్ని కార్యక్రమాలకు వెళ్తున్నారు.ప్రస్తుతం ఆయన స్వామి అయప్ప మాలలో ఉన్నాడు.
అయినా కూడా పెళ్లికి వెళ్లి కొత్త దంపతులను ఆశీర్వదించాడు.గాడ్ ఫాదర్ సినిమా చిత్రీకరణ సగం వరకు పూర్తి అయ్యింది.ఇటీవలే భోళా శంకర్ సినిమాను పట్టాలెక్కించారు.మరో వైపు వాల్తేరు వీరన్న సినిమాను కూడా చేస్తున్నారు .ఇలా ఇన్ని సినిమాలు ఉన్న నేపథ్యంలో చిరంజీవి అన్ని కార్యక్రమాలకు వెళ్తూ అందరిని కూడా తన ప్రజెన్స్ తో ఆనందింపజేస్తున్నాడు.ఇది మంచి పరిణామం అంటున్నారు.
చిరంజీవి ఆశీర్వాదంతో కొత్త దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.